News December 2, 2024

KNR: కొయ్యూరు ఎన్‌కౌంటర్‌కు 25 ఏండ్లు

image

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన కొయ్యూరు ఎన్‌కౌంటర్‌ జరిగి నేటికి 25 ఏండ్లు గడిచింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులైన నల్లా ఆదిరెడ్డి, ఎర్రం రెడ్డి సంతోష్ రెడ్డి, శీలం నరేశ్ ఈ ఎన్‌కౌంటర్‌‌లో మృతి చెందారు. దీనికి గుర్తుగా మావోయిస్టులు బేగంపేటలో స్మారక స్తూపం ఏర్పాటు చేశారు. మావోయిస్టులు డిసెంబర్ 2 నుంచి 9 వరకు పీఎల్జీఏ వారోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.

Similar News

News December 17, 2025

కరీంనగర్ జిల్లాలో 86.42% పోలింగ్ నమోదు

image

కరీంనగర్ జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 5 మండలాల్లో తుది పోలింగ్ శాతం వివరాలను అధికారులు వెల్లడించారు. మొత్తం 86.42% పోలింగ్ కాగా, ఇల్లందకుంటలో 87.05%, హుజూరాబాద్ లో 85.94%, జమ్మికుంటలో 85.72%, వీణవంకలో 85.87%, సైదాపూర్ లో 87.85% పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. మొత్తం 111 గ్రామ పంచాయితీల్లో 165046 ఓట్లకు గాను 142637 ఓట్లు పోలయ్యాయి.

News December 17, 2025

కరీంనగర్ జిల్లాలో తొలి ఫలితాన్ని ప్రకటించిన అధికారులు

image

ఇల్లందకుంట మండలం బోగంపాడు గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాన్ని అధికారులు వెల్లడించారు. గ్రామంలోని ఎనిమిది వార్డులకు గాను ఏడు స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన ఒక్క వార్డుకు బుధవారం పోలింగ్ నిర్వహించారు. లెక్కింపు పూర్తికావడంతో విజేతను ప్రకటించి, జిల్లాలోనే తొలి ఫలితంగా నిలిపారు. సర్పంచ్ స్థానం ఇదివరకే ఏకగ్రీవం కాగా, ఇప్పుడు వార్డు సభ్యుల ఎన్నిక పూర్తి కావడంతో ఉపసర్పంచ్ పదవిని ఎవరు దక్కించుకుంటారో చూడాలి.

News December 17, 2025

కరీంనగర్ జిల్లాలో మండలాల వారీగా పోలింగ్ ఎంతంటే..?

image

కరీంనగర్ జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఐదు మండలాల్లో కలిపి 84.35 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 110 గ్రామ పంచాయతీల్లో 1,65,046 మంది ఓటర్లు ఉండగా, 1,39,222 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మండలాల వారీగా ఇల్లంతకుంటలో 85.35%, హుజురాబాద్‌లో 85.06%, జమ్మికుంటలో 82.10%, వీణవంకలో 82.39%, వి.సైదాపూర్‌లో అత్యధికంగా 87.46% పోలింగ్ నమోదైంది.