News October 26, 2024

KNR: కౌలు రైతులకు సాయం అందేనా!

image

కరీంనగర్ జిల్లాలో వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న కౌలురైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పట్టాదారులకు పంట రుణాలు, రుణమాఫీలు అందిస్తూ కౌలు రైతులను నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నారు. దీంతో పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులే దిక్కవుతున్నారు. ప్రభుత్వం రైతు భరోసా కింద కౌలు దారులకు ఏటా ఎకరానికి రూ.15వేల చొప్పున సాయం అందించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. రైతులు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

Similar News

News November 16, 2025

కరీంనగర్: ఈ మండలాల్లో రిపోర్టర్లు కావలెను..!

image

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి, వీణవంక, జమ్మికుంట, మానకొండూరు, తిమ్మాపూర్ మండలాల నుంచి రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ లింకుపై <>క్లిక్<<>> చేసి వివరాలు నమోదు చేయండి.

News November 16, 2025

కరీంనగర్: ఓటరు జాబితా సవరణపై సీఈఓ సమీక్ష

image

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సి. సుదర్శన్ రెడ్డి తెలంగాణలోని అన్ని ఈఆర్ఓలు, ఏఆర్‌వోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటరు జాబితా ప్రత్యేక తీవ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమం పురోగతిని, పెండింగ్‌లో ఉన్న ఎన్నికల సంబంధిత అంశాలను ఆయన సమీక్షించారు. ఈ కాన్ఫరెన్స్‌లో కరీంనగర్ కలెక్టరేట్ నుండి అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ పాల్గొన్నారు.

News November 16, 2025

కేశవపట్నం పీఎస్‌లో సీపీ గౌస్ ఆలం ఆకస్మిక తనిఖీ

image

కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం శనివారం కేశవపట్నం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఠాణా పనితీరు, పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన, పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతిని, వాటికి సంబంధించిన కేసు డైరీలను పరిశీలించారు. దర్యాప్తు వేగవంతం చేయాల్సిన కేసుల వివరాలను అడిగి తెలుసుకున్న అనంతరం, ఠాణా అధికారి ఎస్సై శేఖర్‌కు సీపీ కీలక ఆదేశాలు జారీ చేశారు.