News October 16, 2024
KNR: గుండెపోటుతో ఐదేళ్ల చిన్నారి మృతి

గుండెపోటుతో చిన్నారి మృతి చెందిన ఘటన BHPL జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. కుటుంబీకుల ప్రకారం.. టేకుమట్ల మండలంలోని పంగిడిపల్లి గ్రామానికి చెందిన రాజు, జమున దంపతులు కొడుకు, కూతురుతో కలిసి జమ్మికుంటలో ఉంటున్నారు. చిన్నారి పాఠశాలకు వెళ్లే క్రమంలో కళ్లు తిరుగుతున్నాయని చెప్పడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి, అక్కడి నుంచి HNK తీసుకెళ్లి చూపించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారన్నారు.
Similar News
News November 19, 2025
JMKT: ప్రారంభమైన పత్తి కొనుగోళ్లు.. రేపు మార్కెట్కు సెలవు

జమ్మికుంట మార్కెట్లో పత్తి కొనుగోళ్లు నాలుగు రోజుల విరామం తర్వాత బుధవారం ప్రారంభం కాగా ధరలు ఇలా ఉన్నాయి. మార్కెట్కు రైతులు 351 క్వింటాళ్ల విడి పత్తిని తీసుకురాగా.. గరిష్ఠంగా రూ.7,090, కనిష్ఠంగా రూ.6,000 ధర పలికింది. అలాగే గోనె సంచుల్లో వచ్చిన 14 క్వింటాళ్ల పత్తికి గరిష్ఠంగా రూ.6,600 ధర లభించింది. గురువారం అమావాస్య సందర్భంగా మార్కెట్కు సెలవు ప్రకటించినట్లు ఉన్నతశ్రేణి కార్యదర్శి రాజా తెలిపారు.
News November 19, 2025
జమ్మికుంటలో నేటి నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభం

పత్తి కొనుగోళ్లలో సీసీఐ (CCI) అమలు చేస్తున్న కఠిన నిబంధనలపై ఈ నెల 17 నుంచి నిలిచిపోయిన పత్తి కొనుగోళ్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. కాగా, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో జమ్మికుంట మార్కెట్లో నేటి నుంచి పత్తి కొనుగోలు యథావిధిగా జరుగుతుందని మార్కెట్ ఛైర్పర్సన్ స్వప్న తెలిపారు.
News November 19, 2025
జమ్మికుంటలో నేటి నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభం

పత్తి కొనుగోళ్లలో సీసీఐ (CCI) అమలు చేస్తున్న కఠిన నిబంధనలపై ఈ నెల 17 నుంచి నిలిచిపోయిన పత్తి కొనుగోళ్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. కాగా, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో జమ్మికుంట మార్కెట్లో నేటి నుంచి పత్తి కొనుగోలు యథావిధిగా జరుగుతుందని మార్కెట్ ఛైర్పర్సన్ స్వప్న తెలిపారు.


