News July 18, 2024
KNR: గ్రూప్-1 మెయిన్స్కు ఉచిత శిక్షణ
గ్రూప్-1 మెయిన్స్కు ఎంపికైన అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ రవి కుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలకు చెందిన ఔత్సాహికులు దరఖాస్తులను వెబ్సైట్
www.tgbcstudycircle.cgg.gov.inలో ఈ నెల 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 75 రోజుల పాటు నిర్వహించే శిక్షణ ఈ నెల 22న మొదలవుతుందన్నారు.
Similar News
News October 7, 2024
కరీంనగర్ మహాశక్తి ఆలయంలో ఘనంగా మహాలింగార్చన
కరీంనగర్ మహాశక్తి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి మహా లింగార్చన కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రిత్వచ్ఛారణల మధ్య ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మహాలింగ అర్చన చేశారు. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొని మహాలింగార్చన ప్రమిదలను వెలిగించారు. మహా లింగార్చన కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
News October 7, 2024
జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తా: MLA గంగుల
జర్నలిస్టులకు ఇండ్ల పట్టాల రద్దుపై సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే గంగుల బహిరంగ లేఖ రాశారు. జర్నలిస్టుల మీద ఎందుకు ఈ వివక్ష అని ప్రశ్నించారు. ఎన్నికల్లో చెప్పిందేంటి ఇప్పుడు చేస్తున్నది ఏంటీ, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల పట్టాలను రద్దు చేయిస్తారా? అని పేర్కొన్నారు. దసరాకు జర్నలిస్టుల కుటుంబాల్లో పండగ లేకుండా చేస్తారా అని ప్రశ్నించారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానన్నారు.
News October 7, 2024
కరీంనగర్ జర్నలిస్టులు ఏం అన్యాయం చేశారు: బండి సంజయ్
కరీంనగర్ జర్నలిస్టులకు ఇండ్ల పట్టాల రద్దుపై బండి సంజయ్ స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. ‘జర్నలిస్టుల నోటికాడ ముద్దను లాగేసుకుంటారా? బతుకమ్మ పండుగకు ముందు జర్నలిస్టుల బతుకులతో ఆటలా?. ఇదేనా ఇందిరమ్మ రాజ్యమంటే?’ అని ప్రశ్నించారు.