News January 26, 2025
KNR: జిల్లా అధికారులకు మెమోలు జారీ: జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

కేంద్ర మంత్రి పర్యటనలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన కారణంగా పలువురు జిల్లా అధికారులకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి శనివారం మెమోలు జారీ చేశారు. శుక్రవారం కరీంనగర్లో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పర్యటనలో అధికారుల సమన్వయ లోపంతో ఇబ్బందులు తలెత్తాయి. పర్యటనకు విధులు కేటాయించిన ACP, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, డిస్ట్రిక్ట్ యూత్, స్పోర్ట్స్ ఆఫీసర్, సంక్షేమ అధికారి, DEO, DRDOలకు మెమోలు జారీ చేశారు.
Similar News
News February 18, 2025
చొప్పదండి: విండోను సందర్శించిన హిమాచల్ ప్రదేశ్ బృందం

చొప్పదండి సింగిల్ విండోను సోమవారం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర సహకార సంఘాల అధ్యక్షుడు, అధికారుల బృందం సందర్శించింది. సొసైటీ పనితీరు, రైతులకు అందించే సేవలను పాలకవర్గం వారికి వివరించింది. సొసైటీ సభ్యులకు 10 శాతం డివిడెండ్ అందిస్తున్నామని, రైతులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించామని తెలిపారు. వ్యవసాయ రుణాల రికవరీ 100 శాతం చేశామని, ఇతరు రుణాలు 85 శాతం వరకు రికవరీ చేశామని చెప్పారు.
News February 18, 2025
కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

✓ జిల్లాలో మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు✓ జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ మార్కెట్లో పత్తి ధర రూ.6,900✓ శంకరపట్నం మండలంలో తాగుడుకు బానిసై ఒక వ్యక్తి ఆత్మహత్య✓ ముస్లిం ఉద్యోగుల పని వేళల్లో మార్పులు✓ రామడుగు మండలంలో పేద కుటుంబానికి అండగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం✓ ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో నేతలు
News February 18, 2025
కరీంనగర్లో విషాద ఘటన

కరీంనగర్లో విషాద ఘటన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. మల్యాల మండలం నూకపల్లి వాసి చెవులమద్ది స్రవంతి(29) 8నెలల గర్భిణి. ఆదివారం చెకప్కు జగిత్యాలకు వెళ్లగా హార్ట్, ఉమ్మనీరు ప్రాబ్లమ్ ఉందని HYDకి వెళ్లాలని వైద్యులు తెలిపారు. దీంతో ఆమెను KNRకు తరలించి, చికిత్స అందించినప్పటికీ లోపల బిడ్డ మృతిచెందాడు. వైద్యులు ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశారు. అయితే పరిస్థితి విషమించి స్రవంతి కూడా మరణించింది.