News January 27, 2025

KNR: టాస్క్ ఆధ్వర్యంలో ఉచిత టెక్నికల్ శిక్షణ తరగతులు

image

ఉచిత టెక్నికల్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు టాస్క్ ప్రతినిధులు తెలిపారు. ఇంజినీరింగ్, డిగ్రీ ఉత్తీర్ణులై సాప్ట్‌వేర్ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న నిరుద్యోగ యువతకి టెక్నికల్ స్కిల్స్ కోసం ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ తరగతులకు హాజరు కావాలనుకున్న అభ్యర్థులు ఈ నెల 29 సాయంత్రం 5 గంటలలోపు KNR IT టవర్ లోని మొదటి అంతస్తులో గల టాస్క్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

Similar News

News November 19, 2025

JMKT: ప్రారంభమైన పత్తి కొనుగోళ్లు.. రేపు మార్కెట్‌కు సెలవు

image

జమ్మికుంట మార్కెట్‌లో పత్తి కొనుగోళ్లు నాలుగు రోజుల విరామం తర్వాత బుధవారం ప్రారంభం కాగా ధరలు ఇలా ఉన్నాయి. మార్కెట్‌కు రైతులు 351 క్వింటాళ్ల విడి పత్తిని తీసుకురాగా.. గరిష్ఠంగా రూ.7,090, కనిష్ఠంగా రూ.6,000 ధర పలికింది. అలాగే గోనె సంచుల్లో వచ్చిన 14 క్వింటాళ్ల పత్తికి గరిష్ఠంగా రూ.6,600 ధర లభించింది. గురువారం అమావాస్య సందర్భంగా మార్కెట్‌కు సెలవు ప్రకటించినట్లు ఉన్నతశ్రేణి కార్యదర్శి రాజా తెలిపారు.

News November 19, 2025

జమ్మికుంటలో నేటి నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభం

image

పత్తి కొనుగోళ్లలో సీసీఐ (CCI) అమలు చేస్తున్న కఠిన నిబంధనలపై ఈ నెల 17 నుంచి నిలిచిపోయిన పత్తి కొనుగోళ్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. కాగా, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో జమ్మికుంట మార్కెట్‌లో నేటి నుంచి పత్తి కొనుగోలు యథావిధిగా జరుగుతుందని మార్కెట్ ఛైర్‌పర్సన్ స్వప్న తెలిపారు.

News November 19, 2025

జమ్మికుంటలో నేటి నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభం

image

పత్తి కొనుగోళ్లలో సీసీఐ (CCI) అమలు చేస్తున్న కఠిన నిబంధనలపై ఈ నెల 17 నుంచి నిలిచిపోయిన పత్తి కొనుగోళ్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. కాగా, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో జమ్మికుంట మార్కెట్‌లో నేటి నుంచి పత్తి కొనుగోలు యథావిధిగా జరుగుతుందని మార్కెట్ ఛైర్‌పర్సన్ స్వప్న తెలిపారు.