News May 24, 2024
KNR: దుబాయ్లో మృతి.. స్వగ్రామం చేరిన DEAD BODY

జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలోని మోత్కురావుపేట గ్రామానికి చెందిన గణేష్ అనే వ్యక్తి ఇటీవల దుబాయ్లో మ్యాన్ హోల్లో పడి మృతి చెందాడు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చొరవతో అతని మృతదేహం శుక్రవారం గ్రామానికి చేరుకుంది. మృతదేహాన్ని చూడగానే కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు కోరారు.
Similar News
News November 20, 2025
హనుమాన్ నగర్లో వ్యక్తి అనుమానాస్పద మృతి

కరీంనగర్లోని హనుమాన్ నగర్లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. చుట్టుపక్కల వారికి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతుడిని కోహెడ మండలం కూరెళ్ల గ్రామానికి చెందిన బాలరాజుగా గుర్తించారు. మేస్త్రీ పని చేసుకుంటూ కొంతకాలంగా ఒంటరిగా కిరాయి ఉంటున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
News November 20, 2025
KNR: మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

సీఎం వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కరీంనగర్ జిల్లా, మండల మహిళా సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులతో కలెక్టర్ పమోల సత్పతి సమావేశమయ్యారు. ఇందిరమ్మ చీరలు ప్రతి ఒక్కరికీ అందేలా పర్యవేక్షించాలని ఆమె సూచించారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మంజూరైన యూనిట్లతో వ్యాపారాలు ప్రారంభించిన మహిళా సంఘాలు, కృషి, పట్టుదలతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అన్నారు.
News November 20, 2025
KNR: మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

సీఎం వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కరీంనగర్ జిల్లా, మండల మహిళా సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులతో కలెక్టర్ పమోల సత్పతి సమావేశమయ్యారు. ఇందిరమ్మ చీరలు ప్రతి ఒక్కరికీ అందేలా పర్యవేక్షించాలని ఆమె సూచించారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మంజూరైన యూనిట్లతో వ్యాపారాలు ప్రారంభించిన మహిళా సంఘాలు, కృషి, పట్టుదలతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అన్నారు.


