News July 18, 2024
KNR: నేటి నుంచి డీఎస్సీ పరీక్షలు

ఉపాధ్యాయ పోస్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వ నిర్వహిస్తున్న DSC-2024 ఈరోజు నుంచి ప్రారంభంకానున్నాయి. వచ్చేనెల 5 వరకు జరిగే ఈ పరీక్షలకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 8 పరీక్ష కేంద్రాలలో 34,254 ఉంది అభ్యర్థులు హాజరుకానున్నారు. అభ్యర్థులు కేంద్రాలకు నిర్ణీత సమయానికి గంటన్నర ముందుగా హాజరుకావాలని కరీంనగర్, పెద్దపల్లి DEOలు జనార్దన్ రావు, మాధవి తెలిపారు.
Similar News
News November 20, 2025
హనుమాన్ నగర్లో వ్యక్తి అనుమానాస్పద మృతి

కరీంనగర్లోని హనుమాన్ నగర్లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. చుట్టుపక్కల వారికి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతుడిని కోహెడ మండలం కూరెళ్ల గ్రామానికి చెందిన బాలరాజుగా గుర్తించారు. మేస్త్రీ పని చేసుకుంటూ కొంతకాలంగా ఒంటరిగా కిరాయి ఉంటున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
News November 20, 2025
KNR: మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

సీఎం వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కరీంనగర్ జిల్లా, మండల మహిళా సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులతో కలెక్టర్ పమోల సత్పతి సమావేశమయ్యారు. ఇందిరమ్మ చీరలు ప్రతి ఒక్కరికీ అందేలా పర్యవేక్షించాలని ఆమె సూచించారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మంజూరైన యూనిట్లతో వ్యాపారాలు ప్రారంభించిన మహిళా సంఘాలు, కృషి, పట్టుదలతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అన్నారు.
News November 20, 2025
KNR: మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

సీఎం వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కరీంనగర్ జిల్లా, మండల మహిళా సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులతో కలెక్టర్ పమోల సత్పతి సమావేశమయ్యారు. ఇందిరమ్మ చీరలు ప్రతి ఒక్కరికీ అందేలా పర్యవేక్షించాలని ఆమె సూచించారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మంజూరైన యూనిట్లతో వ్యాపారాలు ప్రారంభించిన మహిళా సంఘాలు, కృషి, పట్టుదలతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అన్నారు.


