News February 21, 2025

KNR: నేటి నుంచి భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుభవార్త తెలిపారు. ఈనెల 16 నుంచి 20 వరకు ఈ రైలును తాత్కాలికంగా రద్దుచేశారు. మళ్లీ శుక్రవారం (21) పునరుద్ధరించనున్నారు. మధ్యాహ్నం 3.35గం.లకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఇది బయలుదేరనుంది. ప్రయాణికులు గమనించి రైలును వినియోగించుకోవాలని రైల్వేశాఖ అధికారులు కోరారు.

Similar News

News November 24, 2025

ADB: కొందరు ఖుషిలో.. ఇంకొందరు నిరాశలో

image

ఉమ్మడి జిల్లాలో సర్పంచ్ రిజర్వేషన్ల కేటాయింపు రిజర్వేషన్లు కొందరిని ఆనంద పర్చగా.. మరికొందరిని నిరాశలోకి నెట్టింది. జిల్లాలో బీసీలు ఆశించిన చాలా స్థానాలు మళ్లీ ఎస్టీలకు రిజర్వుడ్ కావడంతో నిరాశ అలుముకుంది. ఇదే సమయంలో బీసీలకు కేటాయించిన పలు స్థానాల్లో జనరల్ రిజర్వేషన్ రావడంతో తీవ్ర పోటీ నెలకొంది. తమకున్న అవకాశాలు చేజారాయని బీసీలు నిరాశలో ఉన్నారు. SC, STలు ఖుషీలో ఉన్నారు.

News November 24, 2025

చెరకు నరికిన తర్వాత ఆలస్యం చేస్తే..

image

చెరకు నరికిన తర్వాత రోజులు, గంటలు గడుస్తున్నకొద్దీ గడలలోని సుక్రోజ్ శాతం తగ్గుతుంది. ఈ గడలను గానుగాడించకుండా ఉంచితే.. నిల్వ కాలం పెరిగేకొద్దీ బరువు తగ్గుతుంది. చెరకు నరికిన తర్వాత 24 గంటలు ఆలస్యమైతే 1.5%, 48 గంటలు ఆలస్యమైతే 3%, 72 గంటలు ఆలస్యమైతే 5% వరకు దిగుబడిలో నష్టం జరుగుతుంది. అదే విధంగా రసనాణ్యతలోనూ 0.4%-0.6% వరకు క్షీణత కనిపిస్తుంది. నరికిన చెరకును నీడలో ఉంచితే ఈ నష్టం కొంత తగ్గుతుంది.

News November 24, 2025

చర్లపల్లి టెర్మినల్‌కు ఈ రోడ్డు వేస్తే తిరుగేలేదు!

image

SCR సేవలకు వేదికైనా చర్లపల్లి టెర్మినల్‌ సక్సెస్ సాధించింది. ఈ స్టేషన్‌ను రూ.430 కోట్లతో అభివృద్ధి చేయగా ప్రయాణికుల ఆదరణ పెరిగింది. మేడ్చల్ జిల్లాతో పాటు సిటీ శివారులోని ప్రయాణికులు ఇటువైపే మొగ్గుచూపుతున్నారు. ఏటా సుమారు రూ.300 కోట్ల ఆదాయం వస్తున్నట్లు సమాచారం. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు ఉప్పల్ నుంచి చర్లపల్లి రోడ్లు తయారయ్యాయి. ఈ రోడ్లను బాగు చేస్తే మరింత ఆదరణ పెరిగే అవకాశం ఉంది.