News February 21, 2025
KNR: నేటి నుంచి భాగ్యనగర్ ఎక్స్ప్రెస్

ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుభవార్త తెలిపారు. ఈనెల 16 నుంచి 20 వరకు ఈ రైలును తాత్కాలికంగా రద్దుచేశారు. మళ్లీ శుక్రవారం (21) పునరుద్ధరించనున్నారు. మధ్యాహ్నం 3.35గం.లకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఇది బయలుదేరనుంది. ప్రయాణికులు గమనించి రైలును వినియోగించుకోవాలని రైల్వేశాఖ అధికారులు కోరారు.
Similar News
News November 23, 2025
ములుగు: పార్టీకి చెప్పే లొంగిపోయాం: ఆజాద్

ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మొద్దులగూడె వాసి, మావోయిస్టు నేత కొయ్యడ సాంబయ్య@ఆజాద్ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర కమిటీలో దామోదర్, వెంకన్న ఇద్దరు పార్టీలో కీలకంగా ఉన్నారన్నారు. వారు సైతం లొంగిపోవాలని ఆయన కోరారు. కాగా పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని, పార్టీకి చెప్పే తాము లొంగిపోయామని ఆజాద్ పేర్కొన్నారు.
News November 23, 2025
GWL: హోంగార్డుల భద్రతకు ఆరోగ్య బీమా అనివార్యం: ఎస్పీ

హోంగార్డుల భద్రతకు ఆరోగ్య బీమా అనివార్యమని గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో హోంగార్డుల సంక్షేమంపై ప్రత్యేక సమావేశం నిర్వహించి, ఆరోగ్య బీమాపై అవగాహన కల్పించారు. పోలీస్ వ్యవస్థలో ముఖ్య భూమిక పోషించే హోంగార్డులకు అనారోగ్యం ఎదురైనప్పుడు ఆరోగ్య బీమా రక్షణ కవచంలా నిలుస్తుందని, ప్రతి ఒక్కరూ బీమా తీసుకొని భద్రతను పెంపొందించుకోవాలని ఎస్పీ సూచించారు.
News November 23, 2025
GWL: హోంగార్డుల భద్రతకు ఆరోగ్య బీమా అనివార్యం: ఎస్పీ

హోంగార్డుల భద్రతకు ఆరోగ్య బీమా అనివార్యమని గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో హోంగార్డుల సంక్షేమంపై ప్రత్యేక సమావేశం నిర్వహించి, ఆరోగ్య బీమాపై అవగాహన కల్పించారు. పోలీస్ వ్యవస్థలో ముఖ్య భూమిక పోషించే హోంగార్డులకు అనారోగ్యం ఎదురైనప్పుడు ఆరోగ్య బీమా రక్షణ కవచంలా నిలుస్తుందని, ప్రతి ఒక్కరూ బీమా తీసుకొని భద్రతను పెంపొందించుకోవాలని ఎస్పీ సూచించారు.


