News September 29, 2024

KNR: నేడు ఎలక్ట్రికల్ బస్సుల ప్రారంభం

image

నేడు (ఆదివారం) కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో ఉదయం 9:30 గం.లకి ఎలక్ట్రికల్ బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రీజినల్ మేనేజర్ సుచరిత తెలిపారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఆర్టీసీ వైఎస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News October 17, 2025

రసమయి బాలకిషన్‌పై చర్యలు తీసుకోవాలి: కాంగ్రెస్ ఫిర్యాదు

image

మానకొండూరు MLA కవ్వంపల్లి సత్యనారాయణపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ MLA రసమయి బాలకిషన్‌పై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని జిల్లా కాంగ్రెస్ నాయకులు CP గౌష్ ఆలంకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నాయకులు అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. గోసి గొంగడి నినాదంతో రాజకీయాల్లోకి వచ్చిన రసమయి బాలకిషన్ ఈరోజు వందల కోట్ల ఆస్తులు, ఫామ్ హౌస్‌లు ఎలా సంపాదించారో బహిరంగంగా చెప్పాలని డిమాండ్‌ చేశారు.

News October 17, 2025

స్పెషల్ బ్రాంచ్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన సీపీ

image

కరీంనగర్‌లో స్పెషల్ బ్రాంచ్ (ఎస్‌బీ) నూతన కార్యాలయాన్ని సీపీ గౌష్ ఆలం శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఇంతకుముందు పోలీస్ కమిషనర్ నివాసం వద్ద ఉన్న ఎస్‌బీ కార్యాలయాన్ని, పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని అమరవీరుల స్మారక భవనంలోకి మార్చారు. నూతన కార్యాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం సీపీ దీనిని ప్రారంభించారు. నూతన భవనం ద్వారా ఎస్‌బీ మరింత మెరుగైన సేవలు అందించాలని సీపీ ఆకాంక్షించారు.

News October 17, 2025

గన్నేరువరం: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

image

ప్రజలకు పంపిణీ చేస్తున్న రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా సివిల్‌ సప్లై అధికారులు శుక్రవారం పట్టుకున్నారు. అక్రమంగా రేషన్‌ బియ్యాన్ని తరలిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు మండలంలోని గుండ్లపల్లి ఎక్స్ రోడ్డు వద్ద సివిల్‌ సప్లై అధికారుల పట్టుకున్నట్లు ఎస్సై వివరించారు. బొలెరోలో 50 క్వింటాళ్ల రేషన్ బియ్యం లభ్యమయ్యాయి. సివిల్ సప్లై అధికారి ఫిర్యాదు మేరకు బొజ్జ రాజు పైన కేసు నమోదు చేశారు.