News February 24, 2025
KNR: నేడు ప్రజావాణి రద్దు: జిల్లా కలెక్టర్

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో నేడు నిర్వహించే ప్రజా వాణి కార్యక్రమం రద్దు చేయడంతో పాటు, గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక పూర్తయ్యే వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించమని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఫిర్యాదులు చేయాలనుకునే వారు ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తియిన తర్వాత రావాలని తెలిపారు.
Similar News
News January 7, 2026
KNR: ‘పాఠశాలల్లో ఫిర్యాదుల పెట్టెలు ఉండాలి’

కలెక్టరేట్, విద్యార్థుల రక్షణే ధ్యేయంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఫిర్యాదుల పెట్టెలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. ‘స్నేహిత’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన VCలో ఆమె మాట్లాడారు. లైంగిక వేధింపుల నివారణకు ఈ పెట్టెలు కీలకమని, వీటి తాళాలు మహిళా కానిస్టేబుళ్ల వద్దే ఉంటాయని స్పష్టంచేశారు. విద్యార్థులు ధైర్యంగా ఫిర్యాదు చేసేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలన్నారు.
News January 7, 2026
కరీంనగర్: ‘సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి’

సైబర్ నేరాల పట్ల మహిళలు, విద్యార్థినులు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైం డీఎస్పీ రమేష్ సూచించారు. ‘ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్’ ప్రచారంలో భాగంగా కరీంనగర్లోని స్థానిక మహిళా డిగ్రీ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. డేటింగ్ యాప్లు, మ్యాట్రిమోనియల్ మోసాలు, సైబర్ స్టాకింగ్పై వీడియోల ద్వారా అవగాహన కల్పించారు. మోసపోతే వెంటనే 1930 నంబర్కు ఫిర్యాదు చేయాలని కోరారు.
News January 5, 2026
కరీంనగర్: ఓటర్ల జాబితాలో ‘గందరగోళం’

కరీంనగర్ నగరపాలక సంస్థ ఓటర్ల జాబితా తప్పుల తడకగా తయారైంది. వార్డుల వారీగా కాకుండా పాత బూత్ల ప్రకారమే జాబితాను రూపొందించారని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఒక డివిజన్ ఓటర్లు మరోచోట చేరారు. వెదురుగట్ట గ్రామ ఓటర్లు తీగలగుట్టపల్లి జాబితాలో ఉండటం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఈ తప్పిదాలపై బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తోంది. అధికారులు ఎప్పుడు సరిచేస్తారో వేచి చూడాలి.


