News January 31, 2025
KNR: పట్టభద్రులు మేల్కోండి.. నేడే LAST

ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లా పట్టభద్రుల మండలి ఎన్నికల షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే పోటీ దారులు క్షేత్ర స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. పట్టభద్రులను, ఉపాధ్యాయులను కలుస్తూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు. పట్టభద్రుల ఓటర్ నమోదుకు దరఖాస్తుల స్వీకరణ నేటితో ముగియనుంది.
Similar News
News February 28, 2025
కాజల్, తమన్నాను విచారించనున్న పోలీసులు

క్రిప్టో కరెన్సీ మోసం కేసులో హీరోయిన్లు కాజల్ అగర్వాల్, తమన్నాను విచారించేందుకు పుదుచ్చేరి పోలీసులు సిద్ధమయ్యారు. ఈ కేసులో ఇప్పటికే నితీశ్ జైన్, అరవింద్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. క్రిప్టో కరెన్సీలో అధిక లాభం వస్తుందని ఆశ చూపి రూ.2.40 కోట్లు మోసం చేసినట్లు పుదుచ్చేరికి చెందిన అశోకన్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో ఆ కంపెనీకి ప్రచారం చేసిన తమన్నా, కాజల్ను పోలీసులు విచారించనున్నారు.
News February 28, 2025
KMR: ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం

ఇంటర్మీడియట్ పరీక్షలు సమీపిస్తున్నాయి. మార్చి 5 నుంచి షురూ కానున్నాయి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా.. ఇంటర్ మొదటి సంవత్సరం 8743, ద్వితీయ సంవత్సరం 9726 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందు కోసం జిల్లా వ్యాప్తంగా 38 పరీక్ష కేంద్రాలు, 38 మంది చీఫ్ సూపరింటెండెంట్లతో పాటు 38 మంది డిపార్ట్మెంటల్ అధికారులను నియమించారు. ఇద్దరు ఫ్లయింగ్ స్క్వాడ్, ఆరుగురు సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను నియమించారు.
News February 28, 2025
భద్రాద్రి: ఇసుక రవాణా.. ప్రాణం బలితీసుకుంది!

అక్రమ ఇసుక రవాణా వల్ల ఓ గిరిజనుడు ప్రాణం కోల్పోవడమే కాక, మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఘటన చర్ల మండలంలో జరిగింది. స్థానికుల వివరాలిలా.. మండలంలోని గుంపెనగుడెంలో ఇసుక ట్రాక్టర్లు తోలుతుండగా, గురువారం అర్ధరాత్రి నిద్రిస్తున్న గిరిజనులపై ఇసుక ట్రాక్టర్ వెళ్లడంతో ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాకు చెందిన కుంజంషన్ను అనే యువకుడు మరణించారని, శ్యామలచెన్ను అనే వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలిపారు.