News January 31, 2025
KNR: పట్టభద్రులు మేల్కోండి.. నేడే LAST

ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లా పట్టభద్రుల మండలి ఎన్నికల షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే పోటీ దారులు క్షేత్ర స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. పట్టభద్రులను, ఉపాధ్యాయులను కలుస్తూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు. పట్టభద్రుల ఓటర్ నమోదుకు దరఖాస్తుల స్వీకరణ నేటితో ముగియనుంది.
Similar News
News November 4, 2025
PDPL: వసతుల కల్పనలో వేగం పెంచాలి: కలెక్టర్

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్య పనులను వేగంగా పూర్తిచేయాలని సూచించారు. మంథని, సుల్తానాబాద్, గోదావరిఖని, ఓదెల, ధర్మారం, శ్రీరాంపూర్లో పనులు డిసెంబర్ 15 నాటికి, రామగుండం నగరంలో పనులు డిసెంబర్ చివరి నాటికి పూర్తికావాలని అధికారులను ఆదేశించారు. అసంపూర్ణ ఇళ్లు లబ్ధిదారులకు అలాట్ చేసేందుకు కూడా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.
News November 4, 2025
ద్వారపూడిలో బైక్-ఆటో ఢీ.. వ్యక్తి మృతి

ద్వారపూడి శివారు వేములపల్లిలో మంగళవారం బైక్, ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇప్పనపాడుకు చెందిన ఇందల దుర్గా సూరిబాబు (28) అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. సూరిబాబు స్నేహితుడి రాజుతో కలిసి బైక్పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తలకు గాయాలు కావడంతో సూరిబాబు మరణించాడు. రాజుకి గాయాలయ్యాయి. మృతదేహాన్ని మండపేట ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 4, 2025
JNTUHలో నిరసనలు, బంద్లు నిషేధం

JNTUHలో బంద్లు, నిరసనల పేరుతో విద్యా కార్యక్రమాలకు అంతరాయం కలిగించడం పూర్తిగా నిషేధించడమైనది ప్రిన్సిపల్ జి.వి నర్సింహ రెడ్డి ప్రకటించారు. విద్యార్థులు తమ చదువులపై దృష్టి పెట్టాలని, అప్రయోజక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రతిష్ఠను దెబ్బతీసే, విద్యా కార్యక్రమాలకు ఆటంకం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు.


