News January 31, 2025

KNR: పట్టభద్రులు మేల్కోండి.. నేడే LAST

image

ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లా పట్టభద్రుల మండలి ఎన్నికల షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే పోటీ దారులు క్షేత్ర స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. పట్టభద్రులను, ఉపాధ్యాయులను కలుస్తూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు. పట్టభద్రుల ఓటర్ నమోదుకు దరఖాస్తుల స్వీకరణ నేటితో ముగియనుంది.

Similar News

News December 5, 2025

మొదటి విడత.. 461 సర్పంచ్, 1,954 వార్డు స్థానాలకు పోటీ

image

జగిత్యాల జిల్లాలో ఈనెల 11న మొదటి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో 7 మండలాల్లోని మొత్తం 122 సర్పంచ్, 1,172 వార్డు స్థానాలకు పోలింగ్ జరగనుంది. అయితే నామినేషన్ల ఉపసంహరణ తర్వాత 122 సర్పంచి స్థానాలకు గాను మొత్తం 461 మంది, అలాగే 1,172 వార్డు స్థానాలకు గాను మొత్తం 1,954 మంది ఎన్నికల బరిలో నిలిచారు. వీరంతా ఈనెల 11న జరిగే మొదటి విడత ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

News December 5, 2025

కామారెడ్డిలో పర్యటించిన బీజేపీ జిల్లా ఇన్‌ఛార్జి

image

కామారెడ్డి జిల్లా పర్యటనకు వచ్చిన బీజేపీ జిల్లా ఇన్‌ఛార్జి విక్రమ్ రెడ్డిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు స్వాగతం పలికారు. కామారెడ్డి జిల్లాకు మొదటిసారిగా వచ్చిన ఆయనకు జిల్లాలో బీజేపీ సంస్థాగత వివరాలను వివరించారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో పార్టీ పటిష్టతపై, నాయకత్వం గురించి తెలిపారు. BJP సీనియర్ నాయకులు మురళీధర్ గౌడ్, పైడి ఎల్లారెడ్డి, హైమారెడ్డి, BJP నాయకులు పాల్గొన్నారు.

News December 5, 2025

PHOTO GALLERY: మెగా పేరెంట్ టీచర్ మీటింగ్

image

AP: రాష్ట్రంలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ విజయవంతంగా ముగిసింది. పార్వతీపురం మన్యం జిల్లా భామినిలో జరిగిన సమావేశంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. పిల్లలకు పాఠాలు చెప్పి అక్కడే మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం విద్యార్థులతో ఫొటోలు దిగారు. అటు పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.