News January 31, 2025

KNR: పట్టభద్రులు మేల్కోండి.. నేడే LAST

image

ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లా పట్టభద్రుల మండలి ఎన్నికల షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే పోటీ దారులు క్షేత్ర స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. పట్టభద్రులను, ఉపాధ్యాయులను కలుస్తూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు. పట్టభద్రుల ఓటర్ నమోదుకు దరఖాస్తుల స్వీకరణ నేటితో ముగియనుంది.

Similar News

News January 10, 2026

పోలీస్ బ్యారెక్స్ గ్రౌండ్‌లో 17న తుక్కు వేలం

image

విశాఖలో పోలీస్ స్టేషన్లు, విభాగాలు నుంచి సేకరించిన నిరుపయోగమైన ఇనుము, అల్యూమినియం, చెక్క, ప్లాస్టిక్ వస్తువులు జనవరి 17న వేలం వేయనున్నట్లు విశాఖ సీపీ కార్యాలయం నుంచి శనివారం ప్రకటన విడుదల చేశారు. ఆరోజు ఉదయం 10 గంటలకు బహిరంగ వేలం వేయనున్నట్లు తెలిపారు. ఆసక్తిగల వారు జనవరి 12 ఉదయం 10 నుంచి వస్తువులను చూసుకొనవచ్చన్నారు. వేలంలో పాల్గొనే వారు పోలీస్ బ్యారెక్స్, కార్యాలయంలో రిజిస్టర్ చేయించుకోవాలన్నారు.

News January 10, 2026

48 డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో 48 కార్ డ్రైవర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు. అహ్మదాబాద్‌ ప్రాంతంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. టెన్త్ పాసై, డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన అభ్యర్థులు జనవరి 19 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18నుంచి 27ఏళ్లు మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌ల్ సడలింపు ఉంది. నెలకు జీతం రూ.19,900-63,200 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.indiapost.gov.in/

News January 10, 2026

సకల సంపదలు ప్రసాదించే సంపత్కరీ దేవి

image

లలితాదేవి గజ దళానికి అధిపతి అయిన సంపత్కరీ దేవి భక్తులకు ఐహిక, ఆధ్యాత్మిక సంపదలను అనుగ్రహించే కరుణామయి. అంకుశ స్వరూపిణి అయిన ఈ తల్లి, ఏనుగు అహంకారాన్ని అణచినట్లుగా మనలోని అజ్ఞానం, అహంకారాన్ని తొలగిస్తుంది. ఎంతటి పేదరికంలో ఉన్నవారికైనా సౌఖ్యాలను, విజయాలను చేకూర్చడం ఈ దేవి ప్రత్యేకత. కణ్వ మహర్షి బోధించిన ఈ దేవిని నిత్యం ప్రార్థిస్తే శత్రువులపై విజయం, అంతులేని ఐశ్వర్యం, మనశ్శాంతి లభిస్తాయని నమ్మకం.