News March 6, 2025
KNR: పట్టభద్రుల ఎమ్మెల్సీ.. గెలుపు ధ్రువీకరణ పత్రం అందుకున్న అంజిరెడ్డి

ఉమ్మడి మెదక్-నిజామాబాద్- కరీంనగర్-ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డికి గెలుపు ధ్రువీకరణ పత్రం బుధవారం రాత్రి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అందజేశారు. ఎన్నికల పరిశీలకులు బుద్ధ ప్రకాష్ జ్యోతి, అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News March 14, 2026
రామన్నపేట: మార్చి 28 జాతీయ లోక్ అదాలత్

మారుమూల ప్రజలకు న్యాయం అందేలా వివిధ శాఖల అధికారులు కృషి చేయాలని జిల్లా ప్రధాన జడ్జి A.జయరాజు రామన్నపేట కోర్టులో మార్చి 28న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ లో పెండింగ్ కేసులు పరిష్కరించే విధానాలపై DLSA కార్యదర్శి V.మాధవిలత, రామన్నపేట Sr సివిల్ జడ్జి G.సబిత, ప్రిన్సిపల్ Jr సివిల్ జడ్జి S.శిరీష, 2nd క్లాస్ మేజిస్ట్రేట్ జడ్జి D.సత్తయ్యతో కలిసి చర్చించారు. కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News March 14, 2026
పనులను వేగవంతం చేయాలి: ADB కలెక్టర్

జిల్లాలో ప్రతిపాదించిన ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రియల్ పార్క్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రియల్ పార్క్కు సంబంధించిన భూ సేకరణ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్, అండర్ బ్రిడ్జ్ నిర్మాణాల పురోగతి తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత జాబితాలో ఉందన్నారు.
News March 14, 2026
GNT: జాతీయ లోక్ అదాలత్.. 24,756 కేసులు క్లియర్

గుంటూరు కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో జిల్లా వ్యాప్తంగా 24,756 కేసులు పరిష్కరించబడినట్లు రెండవ అదనపు జిల్లా జడ్జి, న్యాయ సేవాధికార సంస్థ ఇన్ఛార్జ్ ఛైర్మన్ నాగరాజా తెలిపారు. 1,694 సివిల్ కేసులు, 22,983 క్రిమినల్ కేసులు, 79 ప్రీ-లిటిగేషన్ కేసులు ఉన్నాయి. మోటారు వాహన ప్రమాద భీమా, చెక్ బౌన్స్ కేసుల్లో పరిష్కరమైన కేసుల మొత్తం విలువ సుమారు రూ.42.58 కోట్లుగా ఉందన్నారు.


