News April 27, 2024
KNR: ప్రజల దృష్టి మరల్చేందుకు BRS, కాంగ్రెస్ డ్రామాలు: బండి సంజయ్

రుణమాఫీపై సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్న కాంగ్రెస్, BRSనేతల తీరుపై కరీంనగర్ MPబండి సంజయ్ విరుచుకుపడ్డారు. 6గ్యారంటీల అమలుపై చర్చ జరగకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇరుపార్టీల నేతలు డ్రామాలాడుతూ మీడియాలో బ్రేకింగ్ల కోసం యత్నిస్తున్నారని మండిపడ్డారు. 100రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని ఆరోపించారు.
Similar News
News January 8, 2026
KNR: బ్యాంకుల భద్రతపై సీపీ గౌష్ ఆలం సమీక్ష

బ్యాంకులు, ఏటీఎంల వద్ద భద్రతను పటిష్టం చేయాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఆదేశించారు. బ్యాంక్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ఆర్బీఐ నిబంధనల ప్రకారం హై-క్వాలిటీ సీసీ కెమెరాలు, పానిక్ బటన్లు, బర్గ్లర్ అలారమ్ వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. నగదు తరలింపుపై పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వాలని, సైబర్ మోసాలపై ఖాతాదారులకు అవగాహన కల్పించాలని సూచించారు.
News January 8, 2026
KNR: ‘విద్యార్థులు స్వయం ఉపాధి పొందేలా ప్రోత్సహించాలి’

కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయ సమీపంలోని ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాలను కలెక్టర్ పమేలా సత్పతి గురువారం సందర్శించారు. తరగతి గదులు, వసతి గృహం, భోజనశాలను పరిశీలించిన ఆమె.. విద్యార్థులకు ఆసక్తి ఉన్న రంగాల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా సంగీతం, కుట్టు శిక్షణ, కంప్యూటర్ కోర్సుల ద్వారా విద్యార్థులు స్వయం ఉపాధి పొందేలా ప్రోత్సహించాలని సూచించారు.
News January 8, 2026
KNR: ‘నిబంధనలు పాటిస్తేనే రోడ్డు ప్రమాదాలకు చెక్’

ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన, బాధ్యతాయుత ప్రవర్తనతోనే ప్రమాద రహిత సమాజం సాధ్యమని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అన్నారు. తిమ్మాపూర్లో జరిగిన ‘జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల’కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జిల్లాలోని బ్లాక్ స్పాట్ల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, వాహనదారులు ‘డిఫెన్సివ్ డ్రైవింగ్’ అలవరచుకోవాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలన్నారు.


