News December 9, 2024
KNR: ప్రజావాణికి 208 దరఖాస్తులు
కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి దరఖాస్తులు వెల్లువెత్తాయి. 208 మంది అర్జీదారులు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజావాణిలో దరఖాస్తులు సమర్పించారు. అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పేయి అర్జీదారుల నుంచి దరఖాస్తుల స్వీకరించి పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు బదిలీ చేశారు. ఫిర్యాదుదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
Similar News
News January 17, 2025
కాంగ్రెస్ హామీలే ఓటమికి టికెట్: బండి సంజయ్
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై కరీంనగర్ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పలు విమర్శలు చేశారు. కాంగ్రెస్ హామీలే ఓటమికి టికెట్ అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో చేసిన వాగ్దానాలు తెలంగాణలో కాంగ్రెస్ హామీల మాదిరిగానే పడిపోవడం ఖాయమన్నారు. కాంగ్రెస్ బూటకపు ప్రచారాలు, బూటకపు హామీలతో ఢిల్లీ తప్పుదోవ పట్టదన్నారు.
News January 17, 2025
భీమదేవరపల్లి: ఎస్సైకి తప్పిన ప్రమాదం
భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామ శివారులో బుధవారం రాత్రి ఓ కారు బోల్తా పడిన విషయం తెలిసిందే. స్థానికుల వివరాలు.. వరంగల్ మిల్స్ కాలనీ ఎస్సైగా పనిచేస్తున్న సురేశ్ కొత్తకొండలోని వీరభద్ర స్వామిని దర్శించుకునేందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో కొత్తపల్లి శివారులో టిప్పర్ను తప్పించబోయి.. ఎస్సై ప్రయాణిస్తున్న <<15167764>>కారు పల్టీలు కొడుతూ<<>> పొలాల్లోకి దూసుకెళ్లింది. ఎస్సై క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
News January 17, 2025
ధర్మపురి ఆలయ ఆదాయ వివరాలు
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గురువారం రూ.1,31,585 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.80,158, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.36,200, అన్నదానం రూ.15,227,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.