News July 3, 2024

KNR: బీరు సీసాతో హత్యాయత్నం.. ఐదుగురిపై కేసు

image

హత్యాయత్నం కేసులో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు చిగురుమామిడి SI రాజేష్ తెలిపారు. సైదాపూర్(M) దుద్దెనపల్లికి చెందిన శ్రీనివాస్ స్వగ్రామానికి వెళ్లేందుకు సోమవారం రాత్రి సుందరగిరి బస్టాండ్‌లో వేచి ఉన్నాడు. ఈ క్రమంలో సుందరగిరికి చెందిన అఖిల్, అజయ్, వేణు, నాగరాజు, సుమిత్‌లు శ్రీనివాసును బీర్ సీసాతో హత్య చేయబోగా తప్పించుకున్నాడు. శ్రీనివాస్ ఫిర్యాదుతో వారిపై కేసు నమోదు చేశారు.

Similar News

News December 24, 2025

కొత్తకొండ వీరభద్రస్వామి జాతర తేదీలు ఇవే

image

భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో వీరభద్ర స్వామి ఆలయంలో 2026 సం.నికి సంబంధించిన బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారయ్యాయి. జనవరి 9 నుంచి 18 వరకు బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. జనవరి 10న వీరభద్ర స్వామి కళ్యాణం, 14న భోగి పండుగ, 15న బండ్ల తిరుగుట(సంక్రాంతి) కార్యక్రమాలు జరుగనున్నాయి. జనవరి 18న అగ్నిగుండాలతో జాతర బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

News December 24, 2025

KNR: ఈ నెల 25 నుంచి రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు

image

స్థానిక అంబేడ్కర్ హాకీ స్టేడియంలో ఈ నెల 25 నుంచి 28 వరకు రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు జరగనున్నట్లు జిల్లా కబడ్డీ సంఘం చీఫ్ పాటర్న్ ప్రసాదరావు వెల్లడించారు. నేడు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 72వ రాష్ట్రస్థాయి సీనియర్స్ పురుషుల, మహిళల కబడ్డీ పోటీలకు 33 జిల్లాల నుంచి క్రీడాకారులు రానున్నట్లు పేర్కొన్నారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను తెలంగాణ రాష్ట్ర జట్టుకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.

News December 23, 2025

కరీంనగర్: బాలసదనంలో వసతుల పరిశీలన

image

మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న బాలసదనం, శిశుగృహ సంరక్షణ కేంద్రాలను జిల్లా ప్రిన్సిపల్ సివిల్ జడ్జి కె.రాణి మంగళవారం సందర్శించారు. పిల్లలకు అందుతున్న భోజన, విద్యా సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం దత్తత ప్రక్రియ, ఫోస్టర్ కేర్ అమలుతీరుపై అధికారులతో సమీక్షించారు. చిన్నారుల సంరక్షణలో ఎటువంటి లోపాలు ఉండకూడదని సూచించారు. జిల్లా న్యాయ సేవా సాధికారత విభాగం సూపరింటెండెంట్ సుజాత ఉన్నారు.