News July 3, 2024
KNR: బీరు సీసాతో హత్యాయత్నం.. ఐదుగురిపై కేసు

హత్యాయత్నం కేసులో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు చిగురుమామిడి SI రాజేష్ తెలిపారు. సైదాపూర్(M) దుద్దెనపల్లికి చెందిన శ్రీనివాస్ స్వగ్రామానికి వెళ్లేందుకు సోమవారం రాత్రి సుందరగిరి బస్టాండ్లో వేచి ఉన్నాడు. ఈ క్రమంలో సుందరగిరికి చెందిన అఖిల్, అజయ్, వేణు, నాగరాజు, సుమిత్లు శ్రీనివాసును బీర్ సీసాతో హత్య చేయబోగా తప్పించుకున్నాడు. శ్రీనివాస్ ఫిర్యాదుతో వారిపై కేసు నమోదు చేశారు.
Similar News
News December 11, 2025
ఫకీర్ పేట్ గ్రామపంచాయతీ సర్పంచ్గా విజయలక్ష్మి

కరీంనగర్ రూరల్ మండలం ఫకీర్ పేట్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో బొద్దుల విజయలక్ష్మి ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఫకీర్ పేట్ గ్రామ సర్పంచ్గా గెలిచారు. తనను గెలిపించిన గ్రామస్థులకు విజయలక్ష్మి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తన గెలుపునకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు, కాంగ్రెస్ పెద్దలకు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు.
News December 11, 2025
కరీంనగర్ జిల్లాలో 81.42% పోలింగ్ నమోదు

కరీంనగర్ జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 5 మండలాల్లో తుది పోలింగ్ శాతం వివరాలను అధికారులు వెల్లడించారు. మొత్తం 81.42% పోలింగ్ కాగా, అత్యధికంగా చొప్పదండిలో 83.66% పోలింగ్ నమోదైంది. కరీంనగర్ రూరల్లో 84.67%, రామడుగులో 82.05%, గంగాధరలో 78.70%, కొత్తపల్లిలో 79.19% పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. మొత్తం 91 గ్రామ పంచాయితీల్లో 152408 ఓట్లకు గాను 124088 ఓట్లు పోలయ్యాయి.
News December 11, 2025
గంగాధర: పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్

గంగాధర మండలంలోని కూరిక్యాల, గంగాధర సహా పలు గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. ఓటు ప్రక్రియ సజావుగా జరుగుతున్న తీరును, ఓటింగ్ విధానాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట ఎంపీడీవో డి.రాము, తహశీల్దార్ అంబటి రజిత, ఎంపీఓ ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు.


