News December 25, 2024

KNR: భూమి లేని పేదలను గుర్తించేదెలా!

image

భూమిలేని పేదలకు ప్రభుత్వం రూ.12 వేలు ఆర్థిక సహాయం అందించనుంది. తొలి విడతగా ఈనెల 28న రూ.6 వేలు జమ చేయనున్నట్లు ప్రకటించింది. ఉపాధి హామీ జాబ్ కార్డు దారుల ఆధారంగా ఎంపిక చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 5,52,932 కార్డుదారులు ఉన్నారు. వీరిలో భూమి ఉన్న వారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ ఆధారంగా చేస్తారా? లేక రైతు భరోసా ఆధారంగా ఎంపిక చేస్తారా! అనేది సందేహంగా మారింది.

Similar News

News December 3, 2025

గన్నేరువరం: ‘క్రీడల్లోనూ బాలికలు ముందుండాలి’

image

బాలికలు చదువుతో పాటు క్రీడల్లోనూ ముందుండి, అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే పేర్కొన్నారు. స్నేహిత అవగాహన కార్యక్రమంలో భాగంగా మంగళవారం తిమ్మాపూర్ కేజీబీవీ, గన్నేరువరం పాఠశాలలను ఆమె సందర్శించారు. అన్ని రంగాల్లోనూ ప్రతిభ చూపాలని బాలికలకు సూచించారు. ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే హెల్ప్‌లైన్ నెంబర్లకు కాల్ చేయాలని కోరారు.

News December 3, 2025

KNR: సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సీపీ

image

డిసెంబర్ 14న జరగనున్న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నేపథ్యంలో తిమ్మాపూర్, మానకొండూర్, శంకరపట్నం, చిగురుమామిడి, గన్నేరువరం మండలాలలో పోలింగ్ కేంద్రాన్ని కరీంనగర్ సీపీ గౌస్ ఆలం సందర్శించారు. ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని, ప్రజలు పోలీసులకు సహకరించాలని, ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సీపీ విజ్ఞప్తి చేశారు.

News December 3, 2025

KNR: ‘ఎన్నికల పనుల్లో అప్రమత్తంగా ఉండాలి’

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నోడల్ అధికారులు వారికి కేటాయించిన విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు తీసుకున్న చర్యలు, పోలింగ్ వరకు తీసుకోవాల్సిన చర్యలపై ఆమె సమీక్షించారు. ఎన్నికలను పారదర్శకంగా, సజావుగా నిర్వహించాలని, ఎలాంటి పొరపాట్లకూ తావివ్వకూడదని ఆమె ఆదేశించారు.