News April 11, 2025

KNR: మహనీయుల జయంతి ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

image

మహనీయుల జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో నాలుగు రోజులపాటు జరిగే వివిధ కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్ యు.ఉమేష్ కుమార్ కలెక్టర్ ఛాంబర్‌లో ఆవిష్కరించారు. కాగా ఏప్రిల్ 11 నుంచి 14 వరకు నాలుగు రోజుల పాటు వివిధ కార్యక్రమాలతో మహనీయుల జయంతి ఉత్సవాలు జరుగనున్నాయి.

Similar News

News November 21, 2025

రానున్న ఐదు రోజులు భద్రాద్రి జిల్లాకు అతి తేలిక పాటి వర్షాలు

image

రానున్న ఐదు రోజులు భద్రాద్రి జిల్లాలో అతి తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాతావరణ హెచ్చరికలు ఏమీ లేవని చెప్పారు. గత కొద్ది రోజులుగా పొడి వాతావరణ ఉండడంతో రైతులు పత్తి పంటను సేకరించుకున్నారు. తిరిగి తేలికపాటి వర్షాలు ప్రారంభం కావడంతో పత్తి, వరి రైతులు నష్టపోయే అవకాశం ఉంది.

News November 21, 2025

వరంగల్: ఫిట్‌నెస్ లేని స్కూల్ వాహనాలను సీజ్ చేయాలని వినతి

image

ప్రైవేట్ పాఠశాలలో నడుపుతున్న ఫిట్‌నెస్ లేని స్కూల్ వ్యాన్‌లను, టాటా మ్యాజిక్ వాహనాలను సీజ్ చేయాలని కోరుతూ ఈరోజు వరంగల్ ఇన్‌ఛార్జ్ ఆర్టీవో శోభన్ బాబుకు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ల్యాదల్ల శరత్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి యార ప్రశాంత్, పీడీఎస్‌యూ నాయకులు అర్జున్, సూర్య పాల్గొన్నారు.

News November 21, 2025

69వ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం

image

69వ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు శుక్రవారం జొహరాపురం పరిధిలోని మున్సిపల్ హై స్కూల్ పాఠశాలలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పోటీల ప్రారంభ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు విజయానికి పొంగిపోకుండా పరాజయానికి ఒత్తిడి కాకుండా స్ఫూర్తిని ప్రదర్శించాలన్నారు. డీఈవో కబడ్డీ ఆడి అందరినీ ఉత్సాహపరిచారు.