News June 11, 2024
KNR: మూడు రోజుల్లో ముగ్గురి మృతి

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి వరుస మరణాలు జరుగుతున్నాయి. గత 3 రోజుల్లో ముగ్గురు మృతి చెందారు. శుక్రవారం ఎల్లంపల్లిలో శంకరయ్య(75), శనివారం గుజ్జులపల్లిలో కందుగుల గ్రామానికి చెందిన దినసరి కూలీ శనిగరం మొగిలి(45), ఆదివారం ఘన్పూర్ తండాకు చెందిన డిగ్రీ విద్యార్థి బానోతు ఆంజనేయులు(18) ప్రమాదవశాత్తు వ్యవసాయ బావుల్లో పడి మృతి చెందారు.
Similar News
News October 25, 2025
వీణవంక: ప్రేమ వివాహ హత్య.. నలుగురికి జీవిత ఖైదే

సంచలనం సృష్టించిన వీణవంక ప్రేమ వివాహ హత్య కేసులో కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. బ్రాహ్మణపల్లికి చెందిన ఎ.శ్రీనివాస్ను 2019లో ఆయన భార్య బంధువులు దాడి చేసి హత్య చేసినట్లు నిర్ధారణ కావడంతో నలుగురు కుటుంబ సభ్యులకు జీవిత ఖైదు విధించారు. ఐపీసీ సెక్షన్ 302 r/w 34 కింద తీర్పునిచ్చిన కోర్టు.. నిందితులైన మండల ఓదేలు, సంపత్, దేవేందర్, లక్ష్మిలకు శిక్షతో పాటు ఒక్కొక్కరికి ₹1,000 జరిమానా విధించింది.
News October 25, 2025
KNR: ‘ఈనెల 30లోగా పరీక్ష ఫీజు తప్పనిసరిగా చెల్లించాలి’

పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు OCT 30 లోగా పరీక్ష ఫీజు తప్పనిసరిగా చెల్లించాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. రెగ్యులర్గా ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా ఈ గడువు లోపు తమ ఫీజు చెల్లించాల్సిందిగా సూచించారు. రూ.50 ఆలస్య రుసుముతో NOV 15 వరకు, రూ. 300 ఆలస్య రుసుముతో DEC 2 వరకు, రూ. 500 ఆలస్య రుసుముతో DEC 15 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని అన్నారు.
News October 25, 2025
JMKT: మార్కెట్కు రెండు రోజులు సెలవు

JMKT మార్కెట్కు శనివారం వారాంతపు సెలవు, ఆదివారం సాధారణ సెలవు ఉంటుందని మార్కెట్ కార్యదర్శి మల్లేశం తెలిపారు. శుక్రవారం మార్కెట్కు రైతులు 1,200 క్వింటాళ్ల విడి పత్తి విక్రయానికి తీసుకురాగా గరిష్ఠంగా రూ.7,200, కనిష్ఠంగా రూ.6,100 పలికింది. గోనె సంచుల్లో 27 క్వింటాళ్లు రాగా గరిష్ఠంగా రూ.6,600 పలికింది. CCI ద్వారా అమ్మిన 26.40 క్వింటాళ్ల పత్తికి గరిష్ఠంగా రూ.7866.70, కనిష్ఠంగా రూ.7785.60 ధర లభించింది.


