News March 15, 2025

KNR: మోసాలకు గురవుతున్న వినియోగదారుడు!

image

మార్కెట్ ఏదైనా మోసాలకు గురవుతున్నది మాత్రం వినియోగదారుడే. తనకు జరిగిన అన్యాయాన్ని వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదులు చేయకపోవడం వల్ల వ్యాపారుల అక్రమాలకు గురవుతున్నారు. కరీంనగర్ పట్టణంలో న్యాయం చేయడానికి వినియోగదారుల ఫోరం కోర్టు ఉన్నా ప్రజల అవగాహన లేమితో వినియోగించుకుంటోంది తక్కువే. నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం. వినియోగదారుల హక్కులను తెలుసుకొని వ్యాపారుల మోసాలకు అడ్డుకట్ట వేయండి.

Similar News

News March 16, 2025

నిజామాబాద్: అనుమానాలను నివృత్తి చేయాలి: కవిత

image

గ్రూప్-1 పరీక్షలు, ఫలితాలపై అభ్యర్థులు లేవనెత్తుతున్న అనుమానాలను ప్రభుత్వంతో పాటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నివృత్తి చేయాలని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. పేపర్ల మూల్యాంకనంలో తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని విద్యార్థులు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. ట్రాన్స్‌లేషన్ సమస్య వల్ల ప్రొఫెసర్లు, లెక్చరర్లు సరిగ్గా మూల్యాంకనం చేయలేకపోయారని అంటున్నారన్నారు. 

News March 16, 2025

SRH: ఈసారి 300 పక్కా.. తగ్గేదేలే!

image

IPL 2025 కోసం SRH సిద్ధమవుతోంది. ఇప్పటికే ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్ మ్యాచులు మొదలుపెట్టింది. ఈ మ్యాచుల్లో జట్టు ఆటగాళ్లు విధ్వంసం సృష్టించారు. SRH-A ఆటగాళ్లు అయితే 5.4 ఓవర్లలోనే 100 పరుగులు బాదేశారు. ఈ జోరు చూస్తుంటే ఈసారి కచ్చితంగా 300 పరుగులు దాటిస్తారని అభిమానులు చర్చించుకుంటున్నారు. కాగా గత సీజన్‌లో RCBపై SRH 287/3 పరుగులు చేసి IPL చరిత్రలోనే హయ్యెస్ట్ స్కోర్ నమోదు చేసిన విషయం తెలిసిందే.

News March 16, 2025

రేపు క్యాబినెట్ భేటీ

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు మంత్రివర్గ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో ఈ భేటీ ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టే పలు బిల్లులకు క్యాబినెట్ ఆమోదం పలకనున్నట్లు తెలుస్తోంది. అలాగే రాజధాని అమరావతిలో సీఆర్డీఏ చేపట్టనున్న 22 పనులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని సమాచారం. ఇంకా పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

error: Content is protected !!