News March 15, 2025
KNR: మోసాలకు గురవుతున్న వినియోగదారుడు!

మార్కెట్ ఏదైనా మోసాలకు గురవుతున్నది మాత్రం వినియోగదారుడే. తనకు జరిగిన అన్యాయాన్ని వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదులు చేయకపోవడం వల్ల వ్యాపారుల అక్రమాలకు గురవుతున్నారు. కరీంనగర్ పట్టణంలో న్యాయం చేయడానికి వినియోగదారుల ఫోరం కోర్టు ఉన్నా ప్రజల అవగాహన లేమితో వినియోగించుకుంటోంది తక్కువే. నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం. వినియోగదారుల హక్కులను తెలుసుకొని వ్యాపారుల మోసాలకు అడ్డుకట్ట వేయండి.
Similar News
News December 4, 2025
CBN దేవుడిని రాజకీయాల్లోకి లాగుతున్నారు: జగన్

AP: సీఎం చంద్రబాబు దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారని YCP చీఫ్ జగన్ విమర్శించారు. శ్రీవారిని ఆయన అభాసుపాలు చేశారని దుయ్యబట్టారు. ‘నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందన్నారు. ఆ నెయ్యితో చేసిన లడ్డూలు భక్తులు తిన్నారనడానికి ఆధారాలు దొరికాయా? కల్తీ నెయ్యి ట్యాంకర్లు ప్రసాదం తయారీలోకి వెళ్లాయా? ప్రతి ట్యాంకర్ను క్షుణ్ణంగా పరీక్షిస్తారు. ఈ క్రమంలో తప్పు జరిగేందుకు ఆస్కారం ఎక్కడుంది’ అని ప్రశ్నించారు.
News December 4, 2025
గద్వాల్: పీఎండీడీకేవై కార్యాచరణ రూపొందించాలి: నీతి ఆయోగ్

దేశవ్యాప్తంగా పీఎండీడీకేవైకు ఎంపిక చేసిన 100 జిల్లాల్లో అమలు చేసేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించాలని నీతి అయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం ఆయా రాష్ట్రాల ఉన్నతాధికారులను ఆదేశించారు. గురువారం ఆయన ఢిల్లీ నుంచి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ పథకం అమలుకు అధికారులు యాక్షన్ ప్లాన్ను పీఎండీడీకేవై వెబ్ సైట్లో ఈనెల 6 లోగా అప్లోడ్ చేయాలన్నారు.
News December 4, 2025
BREAKING: తిరుపతిలో ఒకరి మృతి

తిరుపతిలో గురువారం విషాద ఘటన జరిగింది. గరుడ వారధి ఫ్లైఓవర్ నుంచి గుర్తుతెలియని వ్యక్తి కిందకు దూకి చనిపోయాడు. అలిపిరి పోలీస్ స్టేషన్ సమీపంలోని మీసేవ కేంద్రం ఎదురుగా ఈ ఘటన వెలుగు చూసింది. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. గుర్తు తెలియని వ్యక్తి మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని రుయా మార్చురీకి తరలించారు. అతని వివరాలు తెలిస్తే అలిపిరి పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.


