News October 22, 2024
KNR: రాష్ట్ర విద్యా కమిషన్ సలహాదారుగా ప్రొ.సూరేపల్లి సుజాత

తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ సలహాదారులను రాష్ట్ర ప్రభు త్వం ప్రకటించింది. శాతవాహన యూని వర్శిటీ ప్రొ.సూరేపల్లి సుజాతకు ఇందులో చోటు దక్కింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ వెంకటేశం ఉత్వర్వులు జారీ చేశారు. ఆమె 22 ఏళ్లుగా సోషియాలజీ బోధిస్తున్నారు. సూరేపల్లి సుజాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో దళిత మహిళా సాధికారతపై పీహెచ్ చేశారు.
Similar News
News December 23, 2025
కరీంనగర్: ప్రాణదాతగా ‘108’ అంబులెన్స్ సేవలు

ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ‘108’ అంబులెన్స్ సేవలు ప్రాణదాతగా నిలుస్తున్నాయి. ప్రమాదాలు, గర్భిణీలను ఆసుపత్రులకు చేర్చడం, తదితర సేవలలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. KNR జిల్లాలో ప్రస్తుతం 16 అంబులెన్సులు, 33మంది ఈఎంటీలు, 35 మంది పైలట్లు నిరంతరం అందుబాటులో ఉండి విధులు నిర్వహిస్తున్నారు. గత 20 నెలల కాలంలోనే జిల్లా వ్యాప్తంగా 56,171 మంది బాధితులను సకాలంలో ఆసుపత్రులకు తరలించి ప్రాణాలను కాపాడటం విశేషం.
News December 23, 2025
కరీంనగర్: ప్రాణదాతగా ‘108’ అంబులెన్స్ సేవలు

ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ‘108’ అంబులెన్స్ సేవలు ప్రాణదాతగా నిలుస్తున్నాయి. ప్రమాదాలు, గర్భిణీలను ఆసుపత్రులకు చేర్చడం, తదితర సేవలలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. KNR జిల్లాలో ప్రస్తుతం 16 అంబులెన్సులు, 33మంది ఈఎంటీలు, 35 మంది పైలట్లు నిరంతరం అందుబాటులో ఉండి విధులు నిర్వహిస్తున్నారు. గత 20 నెలల కాలంలోనే జిల్లా వ్యాప్తంగా 56,171 మంది బాధితులను సకాలంలో ఆసుపత్రులకు తరలించి ప్రాణాలను కాపాడటం విశేషం.
News December 23, 2025
KNR: షోకాజ్ నోటీసులపై అదనపు కలెక్టర్కు ‘టీటీయూ’ వినతి

పంచాయతీ ఎన్నికల విధులకు హాజరుకాని ఉపాధ్యాయులకు జారీ చేసిన షోకాజ్ నోటీసులను ఉపసంహరించుకోవాలని కోరుతూ తెలంగాణ టీచర్స్ యూనియన్ (TTU) నాయకులు సోమవారం అదనపు కలెక్టర్, డీఈవో డాక్టర్ అశ్వినీ తనజీ వాంక్డేకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ.. అనారోగ్యం లేదా ఇతర సహేతుకమైన (జెన్యూన్) కారణాలతో విధులకు రాలేని వారికి తప్పనిసరిగా మినహాయింపు ఇస్తామని హామీ ఇచ్చారు.


