News June 10, 2024

KNR: రోడ్డు ప్రమాదం.. మృతుల వివరాలు

image

KNR-WGL జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో <<13411201>>ఇద్దరు<<>> మృతి చెందిన విషయం తెలిసిందే. వివరాలిలా.. శంకరపట్నం(M)కొత్తగట్టుకి చెందిన మహేశ్‌(18), అరవింద్‌చారి(16) బైక్‌పై కేశవపట్నం వస్తున్నారు. ఈ క్రమంలో KNR-HZB వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మహేశ్‌ ఇంటర్మీడియట్‌, అరవింద్‌చారి పదో తరగతి పూర్తి చేశాడు. SI లక్ష్మారెడ్డి చేరుకొని వివరాలు నమోదు చేసుకున్నారు.

Similar News

News October 4, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లు. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కొలువుదిరిన దుర్గ మాతలు @ కొండగట్టులో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. @ దసరా లోపు టీచర్ల నియామక ప్రక్రియ పూర్తి చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి. @ ఎల్లారెడ్డిపేటలో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య. @ కేశవపట్నం పోలీస్స్టేషన్ లో నాగుపాము హల్చల్.

News October 3, 2024

కరీంనగర్: పెరుగుతున్న గుండె వ్యాధిగ్రస్థులు!

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గుండె సంబంధిత వ్యాధిగ్రస్థుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వయసుతో సంబంధం లేకుండా ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. మానసిక ఒత్తిడే కారణమని వైద్యులు అంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ సంవత్సరంలో గుండె వ్యాధుల బాధితులు 30-50 ఏళ్లవారు 1760, 50 ఏళ్ల పైబడినవారు 2640 మంది ఉన్నట్లు వైద్య లెక్కలు చెబుతున్నాయి.

News October 3, 2024

KNR: మూడేళ్ల బాలికపై పిచ్చికుక్కలు దాడి

image

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని కోరపల్లిలో మూడేళ్ల బాలికపై గురువారం పిచ్చికుక్కలు దాడి చేశాయి. స్థానికుల ప్రకారం.. గ్రామానికి చెందిన బాలిక అక్షర.. ఆడుకునేందుకు ఇంటి ముందరికి వచ్చింది. ఈ క్రమంలో అక్కడే ఉన్న కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. బాలికను చికిత్స నిమిత్తం వరంగల్ MGMకు తరలించారు. గ్రామంలో కుక్కల బెడదను నివారించాలని స్థానికులు కోరుతున్నారు.