News March 30, 2024
KNR: వడదెబ్బతో ఆశా వర్కర్ మృతి

వడదెబ్బతో ఓ ఆశా వర్కర్ కరీంగనర్ జిల్లాలో మృతి చెందింది. స్థానికుల వివరాల ప్రకారం.. తిమ్మాపూర్ మండలం నేదునూర్ గ్రామానికి చెందిన రాజేశ్వరి(50) ఆశా కార్యకర్తగా పని చేస్తున్నారు. అయితే ప్రభుత్వం చేపట్టిన సర్వేలో భాగంగా గురువారం ఎండలో ఇంటింటికి తిరుగుతుండగా ఎండకు అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రిలో చేర్పించగా చికిత్సపొందుతూ అదేరోజు సాయంత్రం మృతి చెందారు.
Similar News
News April 22, 2025
కొత్తపల్లి చెరువులో దొరికిన మృతదేహం వివరాలు లభ్యం

కరీంనగర్ కొత్తపల్లి హవేలీ చెరువులో యువకుడి మృతదేహం కనిపించిన విషయం తెలిసిందే. మృతి చెందిన వ్యక్తి భార్గవ్గా పోలీసులు గుర్తించారు. భార్గవ్ తల్లిదండ్రులు కొత్తపల్లికి చెందిన పబ్బోజు నాగరాజు యాదలక్ష్మి కొద్ది రోజుల క్రితం మృతి చెందారు. ఈ క్రమంలో కొత్తపెళ్లి చెరువు వద్ద మృతదేహం లభించడంతో ఆత్మహత్య చేసుకున్నాడా లేక ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
News April 22, 2025
కరీంనగర్ జిల్లాలో ఎక్కడెక్కడ ఎంత ఎండ..

కరీంనగర్ జిల్లాలో ఎండ దంచికొడుతోంది. గడచిన 24 గంటల్లో అత్యధికంగా మానకొండూర్ మండలంలో 43.5°C నమోదు కాగా, జమ్మికుంట 43.4, గంగాధర 43.2, తిమ్మాపూర్ 43.0, కరీంనగర్ 42.8, గన్నేరువరం 42.7, వీణవంక, కరీంనగర్ రూరల్ 42.6, రామడుగు, చిగురుమామిడి 42.5, హుజూరాబాద్, కొత్తపల్లి 42.4, ఇల్లందకుంట 42.3, శంకరపట్నం 42.2, చొప్పదండి 41.5, సైదాపూర్ 40.1°C గా నమోదైంది.
News April 22, 2025
కరీంనగర్: తేలనున్న 35,562 మంది భవితవ్యం

మార్చిలో జరిగిన ఇంటర్ పరీక్ష ఫలితాలను ఇంటర్ బోర్డు నేడు విడుదల చేయనుంది. KNR జిల్లాలో మొత్తం 35,562 మంది పరీక్షలు రాశారు. ప్రథమ సంవత్సరంలో 17,799 మంది, ద్వితీయ సంవత్సరంలో 17,763 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరి భవితవ్యం నేడు తేలనుందని అధికారులు తెలిపారు. ఫలితాలను Way2Newsలో అందరికంటే ముందే తెలుసుకోండి. ALL THE BEST