News May 27, 2024
KNR: విధుల్లో నిర్లక్ష్యం.. విద్యుత్ ఉద్యోగుల సస్పెండ్

సుల్తానాబాద్కు చెందిన ఇద్దరు విద్యుత్ ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ DE తిరుపతి ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించి LC ఇవ్వని కారణంగా విద్యుత్ ఘాతంతో ఓ తాత్కాలిక కార్మికుడికి గాయాలు కావడానికి కారణం కావడంతో సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. వీరిలో లైన్ ఇన్స్పెక్టర్ నరసయ్యతోపాటు వాయిద్య దుకాణాలు, మీసేవ కేంద్రాలకు విద్యుత్ మీటర్ జారీలో ఆలస్యం చేసిన లైన్మెన్ దీన్ దయాల్ ఉన్నారు.
Similar News
News February 13, 2025
జగిత్యాల: మాటలకే పరిమితం కావొద్దు: MLC జీవన్ రెడ్డి

రాజకీయ పార్టీ నాయకులు మాటలకు పరిమితంగా కాకూడదని, చేతల్లో నిరూపించాలని కాంగ్రెస్ MLC జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాలలోని ఇందిరా భవన్లో ప్రభుత్వ విప్ లక్ష్మణ్తో కలిసి గురువారం నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. బండి సంజయ్ మత విద్వేషాలను రెచ్చగొట్టే పని చేయకుండా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ వచ్చేలా సహకరించాలని కోరారు. రిజర్వేషన్లను మతంతో ముడిపెట్టడం సరికాదన్నారు.
News February 13, 2025
కరీంనగర్: సఖి సేవలపై అవగాహన కల్పించాలి: కలెక్టర్

మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని సఖి కేంద్రం, మహిళా సాధికారత విభాగం సేవలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. సఖి కేంద్రం, జిల్లా మహిళా సాధికారత కేంద్రం మేనేజ్మెంట్ కమిటీ సమావేశం గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. సఖి సేవలను గురించి అందరికీ తెలిసేలా ప్రజలు సందర్శించే స్థలాల్లో, కలెక్టరేట్ ప్రాంగణంలో బోర్డులను ఏర్పాటు చేయాలని అన్నారు.
News February 13, 2025
KNR: ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పరిశీలకుల నియామకం

పట్టభద్రుల, ఉపాధ్యాయుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఎలక్షన్ కమిషన్ ఎన్నికల పరిశీలకులను నియమించిందని రిటర్నింగ్ ఆఫీసర్, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు సంజయ్ కుమార్ నంబర్ 9398416403, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు బెన్హర్ మహేశ్ దత్ ఎక్కా నంబర్ 7993744287లో సంప్రదించాలని తెలిపారు.