News January 30, 2025

KNR: విలీన గ్రామాలను సందర్శించిన మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్

image

కరీంనగర్ మున్సిపల్ లో విలీనమైన గ్రామాలలో మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ప్రత్యేక అధికారులతో బుధవారం సందర్శించారు. ఈ సంధర్బంగా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ.. విలీన గ్రామపంచాయతిలలో నియమించిన ప్రత్యేక అధికారులు అన్ని రికార్డులను ప్రొఫార్మా ప్రకారం తనిఖీ చేసి సీజ్ చేశారని తెలిపారు. విలీన గ్రామాలకు నగరపాలక సంస్థ వార్డుగా బోర్డు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

Similar News

News October 24, 2025

KNR: విద్యార్థులకు పోలీసు భద్రతా అవగాహన

image

పోలీసు అమర వీరుల సంస్కరణ వారోత్సవాలను పురస్కరించుకొని ఇవాళ పోలీసు పరేడ్ గ్రౌండ్లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించినారు. ఈ సందర్భంగా సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ.. పోలీసు వ్యవస్థ పనితీరు, డిపార్టుమెంట్‌లో ఉపయోగించే ఆయుధాలు, సాంకేతిక పద్దతులు తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించిరు.

News October 24, 2025

KNR: గదిలో గంజాయి దాచి.. స్నేహితులతో సేవించి

image

కరీంనగర్ బ్యాంక్ కాలనీలో గంజాయి నిలువచేసి వినియోగిస్తున్న చిక్కులపల్లి సాయివిఘ్నేశ్ అనే యువకుడిని పట్టుకొని రిమాండ్ చేసినట్లు 3టౌన్ పోలీసులు తెలిపారు. లంబసింగి ప్రాంతం నుంచి 2కిలోల గంజాయి కొనుగోలు చేసి, తన ఇంటి టెర్రస్‌పై చిన్న గదిలో దాచిపెట్టి, తరచూ తన స్నేహితులతో కలిసి సాయివిఘ్నేశ్ గంజాయి సేవిస్తున్నాడని చెప్పారు. నమ్మదగిన సమాచారం మేరకు నిందితుడితోపాటు గంజాయిని నిన్న పట్టుకున్నట్లు పేర్కొన్నారు.

News October 24, 2025

JMKT: నేటి నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభం

image

జమ్మికుంట పత్తి మార్కెట్లో నేటి నుంచి CCI ద్వారా పత్తి కొనుగోళ్లను ప్రారంభించనున్నట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. పత్తిలో తేమ శాతం 8 నుంచి 12 వరకు ఉండేలా చూసుకోవాలన్నారు. అలా అయితేన్ మద్దతు ధర పొందవచ్చన్నారు. CCI ద్వారా పత్తి అమ్ముకునే రైతులు ‘కపాస్ కిసాన్’ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకొని కొనుగోలు కేంద్రాలకు పత్తి తీసుకురావాలన్నారు. సమస్యలుంటే 18005995779, వాట్సాప్ నంబర్ 8897281111లను సంప్రదించండి.