News January 23, 2026

KNR: స్థానిక సంస్థల నుంచే ఉన్నత శిఖరాలకు..

image

ఉమ్మడి KNR జిల్లా నుంచి కౌన్సిలర్, కార్పొరేటర్లుగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన పలువురు నేడు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. బండి సంజయ్, గంగుల కమలాకర్, రామగుండం మాజీ MLAలు సోమారపు సత్యనారయణ, కోరుకంటి చందర్, KNR మాజీ MLAలు చల్మెడ ఆనందరావు, జువ్వాడి చంద్రశేఖర్‌రావు, ఇందుర్తి మాజీ MLA బొమ్మ వెంకటేశ్వర్లు, మాజీ MLCలు సంతోష్ కుమార్, గోపాల్ రావు తదితరులు కార్పొరేటర్ల నుంచే తమ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు.

Similar News

News February 18, 2026

వరి పంటలో ఎలుకల నిర్మూలనకు అనుకూల సమయం ఏది?

image

వరిలో నాట్లు వేసిన తర్వాత ఎలుకల నిర్మూలన చేపట్టడం సులభమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆ సమయంలో బుట్టలను పెడితే ఎలుకలను సులభంగా నిర్మూలించవచ్చంటున్నారు. పంట చిరుపొట్ట దశలో ఎలుకల నిర్మూలన కష్టంగా మారుతుందని, ఈ సమయంలో బుట్టలతో వాటిని అరికట్టలేమని చెబుతున్నారు. చిరు పొట్ట దశలో ఎలుక కన్నాలను గుర్తిస్తే, పొగ బెట్టడం ద్వారా వాటిని కంట్రోల్ చేయొచ్చని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

News February 18, 2026

ఎల్.ఎన్.పేట: ‘నదీతీరాన ఆకట్టుకున్న ఈశ్వరుడి సైకత శిల్పాలు’

image

ఎల్.ఎన్.పేట గ్రామానికి చెందిన సైకత శిల్పి తరణి ప్రసాద్ మిశ్రా వంశధార నదీ తీరంలో రూపొందించిన సైకత శిల్పాలు అందరినీ ఆకట్టుకున్నాయి. బుధవారం చక్ర తీర్థ స్నానాలు సందర్భంగా శివుడు, శివలింగం కళాకృతులను తరణి ప్రసాద్ మిశ్రా నిర్మించారు. వీటికి భక్తులు పసుపు,కుంకుమలో పూజలు చేశారు.

News February 18, 2026

స్నాక్స్ లాగించేస్తున్నారా?

image

దాదాపు 76% మంది భారతీయులకు రోజుకు రెండుసార్లైనా స్నాక్స్ తినే అలవాటు ఉంది. బిస్కెట్స్, చిప్స్, షుగరీ ఫుడ్స్, డ్రింక్స్ వంటివి తీసుకోవడం వల్ల జీవక్రియపై ఒత్తిడి పడుతుంది. డయాబెటిస్ రిస్క్ పెరిగి, ఆయుష్షుపైన ప్రభావం పడుతుంది. భారతీయుల జీవనశైలికి ప్రొటీన్, ఫైబర్, సరిపడా కార్బ్స్ ఉండే బ్యాలెన్స్‌డ్ మీల్స్ రోజులో 2-3 సార్లు తీసుకుంటే సరిపోతుందని.. స్నాక్స్ అవసరం లేదని వైద్యులు సూచిస్తున్నారు.