News September 12, 2025

KNR: ఆగిన నిధులు.. పారిశుద్ధ్యం వెతలు..!

image

కేంద్ర ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోవడంతో పల్లెల్లో పారిశుద్ధ్య పనులు నిలిచిపోయాయి. ఉమ్మడి KNR వ్యాప్తంగా 1216 గ్రామాల్లో పారిశుద్ధ్యం, మురుగు కాలువలు, విద్యుద్దీపాల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. మున్సిపాలిటీలు, పల్లెల్లో ఫాగింగ్ మెషీన్లున్నా నిరుపయోగంగా మారాయి. డెంగ్యూ, టైఫాయిడ్‌, వైరల్ జ్వరాలతో ప్రజలు అల్లాడుతున్నారు. అధికారులు పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టి నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు.

Similar News

News September 12, 2025

NZB: యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వమే కారణం: మంత్రి

image

రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వమే కారణమని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ, క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం NZBరూరల్ MLAక్యాంప్ కార్యాలయంలో మంత్రి మాట్లాడుతూ
రాష్ట్రానికి సరిపడినంత యూరియా పంపకుండా కేంద్రం తాత్సారం చేస్తోందని ఆరోపించారు. స్టాక్ పంపాలని విన్నపాలు చేసినప్పటికీ అడపాదడపా యూరియా పంపుతూ ఇక్కడి రైతులను కేంద్రం ఇబ్బంది పెడుతోందన్నారు.

News September 12, 2025

ADB: ‘జాతీయ సమావేశాలు జయప్రదం చేయండి’

image

దివ్యాంగులకు విద్య, ఉపాధి, సంక్షేమం, సాధికారత అంశాలపై ఎన్పీఆర్డీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర కమిటీ సమావేశాల సందర్భంగా 2025 అక్టోబర్ 25, 26 తేదీల్లో హైదరాబాద్ జాతీయ సదస్సు ఉంటుందని జిల్లా అధ్యక్షుడు నగేష్ తెలిపారు. ఈసమావేశాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశానికి సంబంధించి కరపత్రాలను ఆవిష్కరించారు.

News September 12, 2025

ఆదిలాబాద్ : ఐటీఐల్లో వాక్ ఇన్ అడ్మిషన్లు

image

ఐటీఐ, ఏటీసీలో చేరేందుకు మరొక అవకాశం కల్పించినట్లు ఆదిలాబాద్ ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆగస్టు 30 వరకు అడ్మిషన్ గడువు ఉండగా సెప్టెంబర్ 30వరకు పొడిగించినట్లు తెలిపారు. ఇప్పటికే 1వ, 2వ, 3వ దశలలో దరఖాస్తు చేసుకున్న వారు కూడా ఈ వాక్-ఇన్ అడ్మిషన్లలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
SHARE IT.