News December 28, 2025

KNR: ఇసుక అక్రమ రవాణా.. 170 కేసులు

image

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో 2025 సంవత్సరంలో 170 ఇసుక అక్రమ రవాణా కేసులు నమోదు కాగా.. 249 మంది పట్టుబడ్డారు. వీరి నుంచి 8 ట్రాక్టర్లు, 7 లారీలు, 3 టిప్పర్స్, 3 జేసీబీలు, 3 బొలెరో వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ ఇసుక ఖరీదు ₹6,75,500 ఉందని సీపీ గౌస్ ఆలం పేర్కొన్నారు. పోలీసులు పటిష్ఠ చర్యలు చేపడుతున్నా ఇసుక మాఫియాకు అడ్డుకట్ట పడడం లేదు.

Similar News

News December 30, 2025

కరీంనగర్: ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు!

image

TGలో మున్సిపల్ ఎన్నికల సందడి అధికారికంగా మొదలైంది. ఎన్నికల కమిషనర్ గిరిధర్ సుందర్ బాబు కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, చొప్పదొండి, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల కమిషనర్లతో నిర్వహించిన VCలో కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరిలో జరగనున్నాయి. ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా చూడాలని, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల లెక్క తేల్చాలని స్పష్టమైన ఆదేశాలు అందాయి.

News December 30, 2025

KNR: యూరియా సరఫరా నిరంతరం పర్యవేక్షించాలి

image

వ్యవసాయ అధికారులు ప్రతిరోజు మండల, క్లస్టర్ స్థాయిలో యూరియా సరఫరాను పర్యవేక్షించాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మండల వ్యవసాయ అధికారులు, ప్రాథమిక సహకార సంఘాల అధికారులతో ఆమె మాట్లాడారు. యూరియా నిల్వలు, సరఫరా, వ్యవసాయశాఖ, కేంద్రప్రభుత్వ పథకాలు, ధాన్యం కొనుగోలు, తదితర అంశాలపై చర్చించారు.

News December 30, 2025

KNR: సన్న బోనస్ ఊసేది..? రైతు భరోసా ఎప్పుడు..?

image

సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామన్న సర్కారు హామీ క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. చాలామంది రైతుల ఖాతాల్లో నేటికీ నగదు జమకాలేదు. మరోవైపు ‘రైతు భరోసా’ ఊసే లేకపోవడంతో జిల్లా రైతాంగం తీవ్ర ఆవేదన చెందుతోంది. అప్పులు తీరక, కొత్త సాగుకు సాయం అందక రైతులు సతమతమవుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలు విడుదల చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.