News December 28, 2025

KNR: ఇసుక అక్రమ రవాణా.. 170 కేసులు

image

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో 2025 సంవత్సరంలో 170 ఇసుక అక్రమ రవాణా కేసులు నమోదు కాగా.. 249 మంది పట్టుబడ్డారు. వీరి నుంచి 8 ట్రాక్టర్లు, 7 లారీలు, 3 టిప్పర్స్, 3 జేసీబీలు, 3 బొలెరో వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ ఇసుక ఖరీదు ₹6,75,500 ఉందని సీపీ గౌస్ ఆలం పేర్కొన్నారు. పోలీసులు పటిష్ఠ చర్యలు చేపడుతున్నా ఇసుక మాఫియాకు అడ్డుకట్ట పడడం లేదు.

Similar News

News December 29, 2025

KNR: జిల్లాలో యూరియా నిల్వలు పుష్కలం: కలెక్టర్

image

కరీంనగర్ జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ప్రస్తుతం 4,246 మెట్రిక్ టన్నుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని, అవసరానికి మించి కొనుగోలు చేయవద్దని కోరారు. విక్రయ కేంద్రాల వద్ద తాగునీరు, నీడ సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అక్రమ నిల్వలు సృష్టించినా, అధిక ధరలకు విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

News December 29, 2025

KNR: మహిళా కూలీలతో అసభ్య ప్రవర్తన.. ఫీల్డ్ అసిస్టెంట్ తొలగింపు

image

మానకొండూరు మండలం పచ్చునూరులో ఉపాధి హామీ మహిళా కూలీలతో అసభ్యంగా ప్రవర్తించిన ఫీల్డ్ అసిస్టెంట్ కురాకుల పోచాలును విధుల్లో నుంచి తొలగిస్తూ DRDO ఉత్తర్వులు జారీ చేశారు. గతంలోనూ సస్పెండై వివాదాస్పదుడైన వ్యక్తిని అధికారులు తిరిగి విధుల్లోకి ఎలా తీసుకున్నారో వారికే తెలియాలని గ్రామస్థులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

News December 28, 2025

కరీంనగర్: రేపటి నుంచి యథావిధిగా ‘ప్రజావాణి’

image

జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ‘ప్రజావాణి’ కార్యక్రమం సోమవారం నుంచి యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగే ఈ కార్యక్రమానికి అర్జీదారులు హాజరుకావాలని సూచించారు. వివిధ సమస్యలపై వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.