News September 22, 2025
KNR: ఊరెళ్తున్నారా..? ఈ నంబర్ SAVE చేసుకోండి..!

బతుకమ్మ, దసరా పండుగలకు సొంత ఊర్లకు వెళ్లే ప్రజలు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం సూచించారు. బంగారం, డబ్బు లాంటి విలువైనవి తమవెంట తీసుకువెళ్లాలని కోరారు. ఊర్లకు వెళ్లేవారు స్థానిక పోలీసులకు, నమ్మకస్థులైన ఇరుగుపొరుగు వారికి ముందస్తు సమాచారం ఇవ్వాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 లేదా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ 8712670744 నంబర్కు కాల్ చేసి సాయం పొందవచ్చన్నారు.
Similar News
News September 23, 2025
జమ్మికుంట: సినీ నిర్మాత నిమ్మల సతీష్ మృతి

అమ్మ ప్రొడక్షన్స్ అధినేత, సినీ నిర్మాత నిమ్మల సతీష్ సోమవారం అకాలమరణం చెందారు. హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బ్రెయిన్ స్ట్రోక్తో ఆయన మృతిచెందినట్లు తెలిపారు. సతీష్ ‘టైంపాస్’, ‘దికాప్’ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఆయన మృతిపట్ల దర్శకుడు జీఎస్ గౌతమ్ కృష్ణ, హీరో దీక్షిత్, సూర్యతో పాటు సినీ ప్రముఖులు, పాత్రికేయులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సతీష్ స్వగ్రామం జమ్మికుంట మండలం జగ్గయ్యపల్లి గ్రామం.
News September 23, 2025
KNR: ‘పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి’

“ప్రజావాణి”లో భాగంగా సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మి కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. 318 అర్జీలు రాగా సత్వర పరిష్కారం కోసం వాటిని వివిధ శాఖల అధికారులకు బదిలీ చేశారు. పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.
News September 23, 2025
KNR: ఓపెన్ పదో తరగతి , ఇంటర్ పరిక్షలకు 82% హాజర్

కరీంనగర్ జిల్లాలో సోమవారం జరిగిన ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలకు 82% మంది విద్యార్థులు హాజరయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీరాం మొండయ్య తెలిపారు. పదో తరగతి పరీక్షకు 37 మందికి గాను 32 మంది (91%), ఇంటర్ పరీక్షకు 73 మందికి గాను 58 మంది (79%) హాజరయ్యారని పేర్కొన్నారు. మధ్యాహ్నం జరిగిన ఇంటర్ పరీక్షకు నలుగురు హాజరయ్యారని వివరించారు.