News January 30, 2025
KNR: ఎమ్మెల్సీ ఎన్నికలకు 499 పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు: కలెక్టర్

మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించి 15 జిల్లాలు, 35 డివిజన్లు, 271 మండలాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఇందుకు 499 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. డివిజన్లలో ఆర్డీవోలు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తారని తెలిపారు. ఉపాధ్యాయుల నియోజకవర్గానికి 274 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
Similar News
News April 25, 2025
కరీంనగర్ జిల్లాలో 44.4°C డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు

కరీంనగర్ జిల్లాలో రోజురోజుకూ ఎండ తీవ్రత పెరుగుతుంది. గడచిన 24 గంటల్లో అత్యధికంగా గంగాధర మండలంలో 44.4°C నమోదు కాగా, జమ్మికుంట 44.3, కరీంనగర్, మానకొండూర్ 44.2, రామడుగు 44.1, చిగురుమామిడి, చొప్పదండి, తిమ్మాపూర్ 43.9, కరీంనగర్ రూరల్ 43.6, గన్నేరువరం 43.4, శంకరపట్నం 43.3, కొత్తపల్లి 43.2, వీణవంక 42.9, ఇల్లందకుంట 42.5, హుజూరాబాద్ 42.1, సైదాపూర్ మండలంలో 41.7°Cగా నమోదైంది.
News April 25, 2025
కరీంనగర్ జిల్లాలో 44.4°C డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు

కరీంనగర్ జిల్లాలో రోజురోజుకూ ఎండ తీవ్రత పెరుగుతుంది. గడచిన 24 గంటల్లో అత్యధికంగా గంగాధర మండలంలో 44.4°C నమోదు కాగా, జమ్మికుంట 44.3, కరీంనగర్, మానకొండూర్ 44.2, రామడుగు 44.1, చిగురుమామిడి, చొప్పదండి, తిమ్మాపూర్ 43.9, కరీంనగర్ రూరల్ 43.6, గన్నేరువరం 43.4, శంకరపట్నం 43.3, కొత్తపల్లి 43.2, వీణవంక 42.9, ఇల్లందకుంట 42.5, హుజూరాబాద్ 42.1, సైదాపూర్ మండలంలో 41.7°Cగా నమోదైంది.
News April 25, 2025
జగిత్యాల: ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య

ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన JGTL పట్టణంలో జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యుల ప్రకారం.. JGTL(D) పోచమ్మ వాడకు చెందిన సాప్ట్ వేర్ ఉద్యోగి ప్రసన్నలక్ష్మి(28), వెల్గటూర్(M)రాంనుర్కు చెందిన గాంధారి తిరుపతికి 2023లో వివాహమైంది. వీరికి సంవత్సరం బాబు ఉన్నాడు. కొన్నిరోజుల క్రితం పుట్టింటికి వచ్చిన ఆమె గురువారం ఇంట్లో ‘సారీ నాన్న.. నాకు బతకాలని లేదు’ అని అద్దంపై రాసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.