News March 5, 2025
KNR: ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్లో 40 మంది ఎలిమినేషన్

కరీంనగర్లోని అంబేడ్కర్ స్టేడియంలో ఎమ్మెల్సీ కౌంటింగ్ మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎన్నిక తేలక పోవడంతో ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు.ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్లో 40 మంది ఎలిమినేట్ అయ్యారు. మొదటి ప్రాధాన్యత ఓటులో ఎమ్మెల్సీ ఓట్లు నిర్ధారణ కాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు అధికారులు లెక్కించనున్నారు.
Similar News
News December 20, 2025
MDK: రైతు కుమారుడికి గ్రూప్-3 జాబ్

TSPSC గురువారం విడుదల చేసిన గ్రూప్-3 పరీక్షా ఫలితాల్లో చిన్నశంకరంపేట మండల పరిధి గజగట్లపల్లికి చెందిన మధు వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగం సాధించాడు. తల్లిదండ్రులు శారద, యాదగిరిలు వ్యవసాయ పనులు చేసుకుంటూ కుమారుడు మధును కష్టపడి చదివించారు. తల్లిదండ్రుల కలను నెరవేర్చడం గర్వంగా ఉందని, గ్రూప్-1 ఉద్యోగం సాధించడమే లక్ష్యమని మధు తెలిపారు.
News December 20, 2025
నల్గొండ: GOVT జాబ్ కొట్టిన అమ్మాయి

గ్రూప్-3 ఫలితాల్లో నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం పెర్కకొండారం గ్రామానికి చెందిన యువతి సత్తా చాటారు. గ్రామానికి చెందిన నివేదిత గ్రూప్-3 పరీక్షలో విజయం సాధించి ఫుడ్ అండ్ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం పొందారు. తన తల్లిదండ్రులు బిక్షం రెడ్డి, సరిత సహకారం, నిరంతర కృషి వల్ల ఈ విజయం సాధ్యమైందని నివేదిత తెలిపారు.
News December 20, 2025
ప్రెగ్నెన్సీలో జున్ను తినొచ్చా?

జున్నులో ఇమ్యునోగ్లోబులిన్ అధికంగా ఉంటుంది. ప్రోటీన్లు, విటమిన్లు A, E, మినరల్స్ పుష్కలంగా ఉండటం వలన తల్లికి, గర్భంలోని శిశువుకు కావాల్సిన పోషకాలు అందుతాయి. అలాగే ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. కానీ జున్ను పాలను సరిగా ఉడికించకుండా తీసుకుంటే ఇందులోని హానికరమైన బ్యాక్టీరియాల వల్ల గర్భిణికి ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు.


