News February 27, 2025
KNR: ఓటు వేసిన బీఎస్పీ అభ్యర్థి

కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది. పోలింగ్ సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగుతుంది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఆయన సతీమణి ప్రసన్న ఓటు హక్కు వినియోగించుకున్నారు. బోయినపల్లి పోలింగ్ కేంద్రంలో వారిరువురు ఓటు వేశారు. ఓటర్లు అందరూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.
Similar News
News February 27, 2025
కరీంనగర్: గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నమోదైన వివరాలు

ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల, టీచర్ల స్థానాలకు గురువారం కరీంనగర్ జిల్లాలోని ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ఉదయం 08.00 గంటల నుంచి 12.00 గంటల వరకు 18.88 శాతం నమోదు అయింది. అలాగే టీచర్ ఎమ్మెల్సీ పోలింగ్ శాతం ఉదయం 08.00 గంటల నుంచి 12.00 గంటల వరకు 34.98 శాతం నమోదు అయింది.
News February 27, 2025
కరీంనగర్: పోలింగ్ స్టేషన్లను సందర్శించిన కలెక్టర్

కరీంనగర్ లోని ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ స్టేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. డాక్టర్ స్ట్రీట్ లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో గల గ్రాడ్యుయేట్ పోలింగ్ స్టేషన్ను, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ స్టేషన్ను సందర్శించారు. పోలింగ్ సరళిపై ప్రిసైడింగ్ అధికారిని అడిగి తెలుసుకున్నారు.
News February 27, 2025
HZB: ఆస్పత్రిలో ఔట్ సోర్సింగ్ సిబ్బంది సస్పెన్షన్

హుజురాబాద్ ఏరియా ఆస్పత్రిలో పనిచేస్తున్న 15 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేశారు. ఆస్పత్రికి వచ్చిన రోగులను ప్రైవేటు ఆస్పత్రిలకు పంపిస్తున్నారని ఆరోపణల మేర వారం రోజుల క్రితం విచారణ జరిపి డీఎంహెచ్వో వెంకట రమణ కలెక్టర్కు నివేదిక సమర్పించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజేందర్ రెడ్డి తెలిపారు.