News November 2, 2025

KNR: క్లెయిమ్ చేయని ఆస్తులపై క్లారిటీ ఇవ్వాలి: కలెక్టర్‌

image

క్లెయిమ్ చేయకుండా వదిలేసిన ఆస్తులపై ప్రజల్లో అవగాహన పెంచాలని కలెక్టర్ పమోలు సత్పతి సూచించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో బ్యాంకు, బీమా సంస్థల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. బ్యాంకు ఖాతా ప్రారంభించేటప్పుడు, నామినీ వివరాలు తప్పనిసరిగా నింపాలని సూచించారు. ఉద్యోగం/ఉపాధి రీత్యా వివిధ ప్రాంతాల్లో చేసిన ఇన్వెస్ట్‌మెంట్లను చాలామంది పట్టించుకోవడం లేదని ఆమె పేర్కొన్నారు.

Similar News

News November 2, 2025

కరీంనగర్ : ఈనెల 15న లోక్ అదాలత్

image

కరీంనగర్, హుజూరాబాద్ కోర్టుల పరిధిలో ఈనెల 15న లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. వెంకటేష్ తెలిపారు. లోక్ అదాలత్‌లో చెక్ బౌన్స్, క్రిమినల్, సివిల్, కుటుంబ తగాదాలకు సంబంధించిన కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కక్షిదారులు తమ కేసులను రాజీ చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

News November 2, 2025

తిమ్మాపూర్: 41 ఏండ్ల సర్వీస్.. స్కూల్ అసిస్టెంట్‌కు ఘన సన్మానం

image

తిమ్మాపూర్ మండలం పొలంపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో 41 ఏండ్ల 8 నెలల సుదీర్ఘ సేవలు అందించిన ఎస్ఏ (సోషల్) టి. రమేష్ కుమార్ దంపతులకు ఘన సన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాధికారి వంగల శ్రీనివాస్, రమేష్ కుమార్ సేవలు ఆదర్శనీయమని ప్రశంసించారు. అనంతరం వారికి జ్ఞాపికలు అందజేసి, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు.

News November 2, 2025

KNR: ‘రివిజన్ ప్రక్రియను సమర్ధవంతంగా చేపట్టాలి’

image

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ) సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి అదనపు సీఈఓ లోకేశ్ కుమార్, ఇతర అధికారులతో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, ఈఆర్‌వోలతో రివిజన్ పురోగతిపై సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పాల్గొన్నారు.