News August 30, 2024

KNR: క్షేత్ర స్థాయిలో రైతుల వివరాల సేకరణ

image

ప్రభుత్వ ఆదేశాలతో వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో రైతు రుణమాఫీ వివరాలను సేకరిస్తున్నారు. రూ.2 లక్షల లోపు పంట రుణం తీసుకున్న రైతులందరికీ ప్రభుత్వం డబ్బులు జమ చేసింది. అయితే సాంకేతిక సమస్యలు, బ్యాంకు తప్పిదాలు, ఆధార్, పట్టా పాస్ బుక్ తదితర సమస్యలతో కొందరు అర్హులకు రుణమాఫీ కాలేదు. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మండలాల వారీగా నోడల్ ఆఫీసర్లు రుణమాఫీ జమకాని రైతుల నుంచి దరఖాస్తుల స్వీకరిస్తున్నారు.

Similar News

News July 11, 2025

కరీంనగర్: ట్రాన్స్ జెండర్లకు శుభవార్త

image

ట్రాన్స్‌జెండర్ల ఉపాధికి తెలంగాణ ప్రభుత్వం కరీంనగర్‌లో ప్రత్యేక పథకం చేపట్టిందని జిల్లా సంక్షేమ అధికారి ఎం.సరస్వతి ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్థిక స్వావలంబనకై వారికీ డ్రైవింగ్, బ్యూటీషియన్ వంటి నైపుణ్య శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు జూలై 23, 2025లోగా www.wdsc.telangana.goవ్.inలో దరఖాస్తు చేయాలని, వివరాలకు 040-24559050ను సంప్రదించాలని వివరించారు.

News July 11, 2025

కరీంనగర్: రేపే చివరి అవకాశం

image

KNR జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి కార్యాలయం నుంచి MBC నిరుద్యోగులకు HYDలో ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ ప్రకటన విడుదలైంది. 4 రోజుల ఈ శిక్షణలో సాఫ్ట్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ నేర్పుతారు. భోజన, వసతి, ప్రయాణ సౌకర్యాలు కల్పిస్తారు. 21-30 ఏళ్ల మధ్య వయస్సు, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ నెల 12లోపు tgobmms.cgg.gov.inలో దరఖాస్తు చేయాలని BC డెవలప్మెంట్ ఆఫీసర్ అనిల్ ప్రకాష్ కిరణ్ తెలిపారు.

News July 11, 2025

KNR: 24 గంటల్లో దొంగలను అరెస్టు చేసిన పోలీసులు

image

కరీంనగర్ మారుతి నగర్‌లో నిద్రిస్తున్న మహిళ మెడలో నుంచి బంగారు పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు నిందితులు నాగరాజు, సదాశివను అరెస్టు చేసినట్లు మూడవ పట్టణ సీఐ జాన్ రెడ్డి తెలిపారు. నిందితులు బంగారు గొలుసు అమ్మేందుకు వెళ్తుండగా చాకచక్యంగా అరెస్టు చేసి, నిందితుల వద్ద బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.