News December 1, 2025
KNR: గుర్తుల అల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం అభ్యర్థుల పేర్లు

సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో గుర్తుల కేటాయింపుపై అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. ఎన్నికల అధికారులు అభ్యర్థుల పేర్లు గుర్తుల అల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం కేటాయిస్తారు. కాగా ఓటర్లు ఈజీగా గుర్తుపట్టే గుర్తులిస్తే బాగుంటుందని, ఎక్కువగా వాడని గుర్తులు అలాట్ చేస్తే ఓటర్లు ఇబ్బంది పడే ఛాన్స్ ఉందని పలువురు చర్చిస్తున్నారు. ఐతే ఎక్కువమంది బరిలో ఉంటే అనువైన గుర్తులు రావని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
Similar News
News December 1, 2025
రైతు సమస్యలపై పార్లమెంట్లో గళమెత్తుతా: ఏలూరు ఎంపీ

పార్లమెంట్ శీతాకాలం సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు విషయాలను ఆయన పార్లమెంట్లో ప్రస్తావిస్తారని తెలుస్తుంది. ప్రధానంగా రైతుల సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టుల పనులు పూర్తి, అలాగే ఇటీవల ఏలూరు-జంగారెడ్డిగూడెం రహదారిని నాలుగు లైన్ల రహదారిగా మార్చేందుకు పార్లమెంట్లో ప్రస్తావిస్తానని ఆయన తెలిపారు.
News December 1, 2025
WGL: చెక్ పవర్పై దృష్టి!

పంచాయతీ ఎన్నికల వేడి గ్రామాల్లో రగులుకుంది. సర్పంచ్గా గెలిచే ఛాన్సు లేని దగ్గర వార్డు మెంబర్గా గెలిచి ఉప సర్పంచ్గా చేయాలని చూస్తున్నారు. గ్రామాల్లో సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్కు కూడా చెక్ పవర్ ఇచ్చారు. పంచాయతీ నిధుల విడుదల సమయంలో సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్కు సైతం ప్రాధాన్యం ఉండడంతో, చెక్ పవర్ ఇచ్చే ఉప సర్పంచ్ పదవులకు సైతం డిమాండ్ ఎక్కువైంది.
News December 1, 2025
HYD: రాజ్ భవన్.. లోక్ భవన్గా మారనుందా?

సోమాజిగూడలోని గవర్నర్ అధికారిక నివాసం రాజ్ భవన్ ఇకనుంచి లోక్భవన్గా మారే అవకాశం ఉంది. గవర్నర్లు నివాసం ఉంటున్న రాజ్భవన్ పేరును లోక్భవన్గా కేంద్రం మార్చాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అధికారికంగా ఆదేశాలు ఇవ్వకపోయినా.. కేంద్రం సూచనల మేరకు ఇప్పటికే తమిళనాడు, పశ్చిమబెంగాల్లోని రాజ్భవన్లు లోక్భవన్గా మారాయి. ఈ క్రమంలో మన రాజ్భవన్ కూడా పేరు మారుతుందా అనే చర్చ సాగుతోంది.


