News April 13, 2025

KNR జిల్లాలో దంచికొడుతున్న ఎండ

image

KNR జిల్లాలో ఎండ దంచికొడుతోంది. గడచిన 24 గంటల్లో అత్యధికంగా జమ్మికుంట మండలంలో 42.3°C నమోదు కాగా, మానకొండూర్ 42.3, గంగాధర 42.1, రామడుగు 41.9, తిమ్మాపూర్ 41.6, KNR 41.5, చొప్పదండి 41.4, చిగురుమామిడి 41.2, KNR రూరల్ 41.0, శంకరపట్నం, గన్నేరువరం 40.9, కొత్తపల్లి 40.5, వీణవంక 40.4, హుజూరాబాద్ 40.3, సైదాపూర్, ఇల్లందకుంట 39.6°C గా నమోదైంది. కాగా, మధ్యాహ్నం సమయంలో ప్రజలు బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు.

Similar News

News April 14, 2025

KNR: అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసిన కలెక్టర్, పోలీస్ కమిషనర్

image

అంబేడ్కర్ జయంతి సందర్భంగా కోర్టు చౌరస్తాలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ అలం పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ చేసిన సేవలను వారు కొనియాడారు. ఆయన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని కోరారు. వారి వెంట జిల్లా అధికార యంత్రాంగం, పోలీస్ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

News April 14, 2025

అలర్ట్: కరీంనగర్ జిల్లా మొత్తం 40°C పై ఉష్ణోగ్రతలు నమోదు

image

KNR జిల్లాలో ఎండ తీవ్రత పెరిగింది. గడచిన 24 గంటల్లో జిల్లా మొత్తం 40°C పై ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా మానకొండూర్ మండలంలో 43.0°C నమోదు కాగా, గంగాధర 42.9, రామడుగు 42.8, జమ్మికుంట 42.7, చిగురుమామిడి 42.6, కరీంనగర్ 42.5, వీణవంక 41.6, గన్నేరువరం 41.5, తిమ్మాపూర్ 41.4, ఇల్లందకుంట, కరీంనగర్ రూరల్ 41.2, చొప్పదండి 40.9, శంకరపట్నం 40.5, కొత్తపల్లి 40.4, హుజూరాబాద్ 40.3, సైదాపూర్ 40.2°C గా నమోదైంది.

News April 14, 2025

వేములవాడ: వ్యక్తి దారుణ హత్య

image

వేములవాడలోని ఓ ఫంక్షనల్ వద్ద ఆదివారం సాయంత్రం వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. నాగయ్యపల్లికి చెందిన చెట్టిపల్లి పరశురాం (39)ను గుర్తుతెలియని వ్యక్తులు హతమర్చారు. మృతుడు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!