News April 5, 2024
KNR: తాగునీటి సరఫరా పై అధికారులతో సమీక్ష
వేసవి నేపథ్యంలో తాగునీటికి గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. గురువారం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాల్లో తాగునీటి సరఫరాపై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ, ఇరిగేషన్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, పలువురు అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Similar News
News October 9, 2024
కరీంనగర్: తమ్ముడిని హత్య చేసిన అన్న
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని దుద్దెనపల్లి గ్రామంలో అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కుందేళ్ల కుమారస్వామి, కుందేళ్ల చంద్రు ఇద్దరు అన్నదమ్ములు. తరచూ వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో నిన్న రాత్రి వీరిద్దరి మధ్య జరిగిన ఘర్షణలో అన్న కుమారస్వామి తమ్ముడైన చంద్రుని ఇనుపరాడ్తో తలపై కొట్టాడు. అనంతరం కుమారస్వామి స్టేషన్లో లొంగిపోయాడు.
News October 9, 2024
తంగళ్లపల్లి: మూడు ప్రభుత్వ కొలువులు సాధించిన యువకుడు
సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లకి చెందిన దాసరి ప్రశాంత్ 2020లో జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా జాబ్ సాధించాడు. విధులు నిర్వహిస్తూనే రైల్వే గ్రూప్ డీ, ఎస్జీటీ టీచర్, TGPSC గ్రూప్4 మూడు ఉద్యోగాలు ఒకేసారి సాధించాడు. సొంత నోట్స్, రోజు ప్రిపరేషన్ వల్ల తను సక్సెస్ కాగలిగానని ప్రశాంత్ తెలిపాడు. ఒకేసారి మూడు ఉద్యోగాలు సాధించిన ప్రశాంత్ను పలువురు గ్రామస్థులు అభినందించారు.
News October 9, 2024
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు
జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మంగళవారం రూ.1,44,849 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,00,714, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.27,915, అన్నదానం రూ.16,220,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేశారు.