News October 9, 2025
KNR: నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి..!

నేడు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే తొలి విడత ఎన్నికలు జరిగే ZPTC, MPTC స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నామినేషన్లు స్వీకరించడానికి అధికారులు అన్నీ ఏర్పాట్లు పూర్తిచేశారు. మొదటి విడతలో KNR జిల్లాలో 6 ZPTC, 70 MPTC, సిరిసిల్ల 7 ZPTC, 65 MPTC, పెద్దపల్లి 7 ZPTC, 68 MPTC, జగిత్యాల 10 ZPTC, 108 MPTC స్థానాలకు మొదటి విడతలో ఎన్నికలు జరగనున్నాయి. SHARE.
Similar News
News October 9, 2025
మరోసారి మీటింగ్ పెడితే బాంబు పెడతా.. విజయ్కు బెదిరింపులు!

సినీ నటుడు, టీవీకే చీఫ్ విజయ్కి బాంబు బెదిరింపులు వచ్చాయి. డయల్ 100కు కాల్ చేసిన దుండగుడు ‘విజయ్ మరోసారి పబ్లిక్ మీటింగ్ నిర్వహిస్తే ఆయన ఇంట్లో బాంబు పెడతా’ అని హెచ్చరించినట్లు సమాచారం. దీంతో చెన్నైలోని విజయ్ ఇంటికి పోలీసులు భద్రత పెంచారు. నిందితుడి ఆచూకీ తెలుసుకునేందుకు లొకేషన్ను ట్రేస్ చేస్తున్నారు. ఇటీవల కరూర్లో విజయ్ పర్యటించగా జరిగిన తొక్కిసలాటలో 41 మంది చనిపోయిన విషయం తెలిసిందే.
News October 9, 2025
నాగర్కర్నూల్లో 6.47 లక్షల ఓటర్లు

నాగర్కర్నూల్ జిల్లాలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో 6,47,342 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. జిల్లాలో రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం 1,228 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటి విడతలో 10 జడ్పీటీసీ, 115 ఎంపీటీసీ స్థానాలకు; రెండో విడతలో 10 జడ్పీటీసీ, 99 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.
News October 9, 2025
JNG: పేరెంట్స్ GREAT.. ఆరుగురి ప్రాణాలు నిలబెట్టారు

రఘునాథపల్లి మండలం గూడెం గ్రామానికి చెందిన గాదె యుగంధర్(29) హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయ్యింది. దీంతో అతని తల్లిదండ్రులు కుమారుని అవయవాలు దానం చేసి ఆరుగురి జీవితాల్లో వెలుగు నింపారు. గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్ర పిండాలు, రెండు కళ్లు వేరు చేసి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి ప్రాణదానం చేశారు.