News April 24, 2025
KNR: నేటి నుంచి బాలభవన్ లో వేసవి శిక్షణ

కలెక్టర్, విద్యాశాఖ సహకారంతో బాలభవన్ ఆధ్వర్యంలో నేటి నుంచి వేసవి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయనిబాలభవన్ సూపరింటెండెంట్ కే.మంజుల దేవి ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 10 వరకు ప్రతీ రోజు ఉదయం 7 గం. నుంచి 12 గం. వరకు శిక్షణ తరగతులు ఉంటాయన్నారు. 5 నుంచి 16 సం. వయస్సు ఉన్న వారు అర్హులని చెప్పారు. ఆసక్తి గల వారు తమ ఆధార్, పాస్ పోర్ట్ సైజ్ ఫొటో తో అంబేడ్కర్ స్టేడియంలోని శిక్షణ శిబిరంలో నమోదు చేసుకోవాలన్నారు.
Similar News
News April 24, 2025
శంకరపట్నం: భూభారతి ఆర్ ఓ ఆర్ చట్టంపై అవగాహన

శంకరపట్నం మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో భూభారతి ఆర్ఓఆర్ చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ పమేల సత్పత్తి హాజరై మాట్లాడుతూ.. ఈ కొత్త చట్టం ద్వారా భూ హక్కులపై కొన్ని కొత్త సవరణలు, విచారణ అధికారం కల్పించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, ఎమ్మార్వో భాస్కర్, ఎంపీడీవో కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
News April 24, 2025
కరీంనగర్: పాత వస్తువులకు వేలం: సీపీ

KNR పోలీస్ కమిషనరేట్లోని వివిధ విభాగాలకు చెందిన ఉపయోగింబడిన, పాత వస్తువులను వేలం వేయనున్నట్లు పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేలం పాట కరీంనగర్ – సిరిసిల్ల బైపాస్ రోడ్డులోని కరీంనగర్ సిటీ ట్రైనింగ్ సెంటర్లో ఈ నెల 28న ఉదయం 10 గంటలకు వేలం నిర్వహించనున్నట్లు అన్నారు. ఆసక్తి ఉన్నవారు ఈ వేలం పాటలో పాల్గొనవచ్చని సీపీ తెలిపారు.
News April 24, 2025
కరీంనగర్ జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు

కరీంనగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా తిమ్మాపూర్ మండలంలో 44.7°C నమోదు కాగా, మానకొండూర్ 44.6, జమ్మికుంట 44.5, రామడుగు 44.4, చొప్పదండి 44.2, కరీంనగర్ 44.1, చిగురుమామిడి, కరీంనగర్ రూరల్ 44.0, వీణవంక, గంగాధర 43.9, శంకరపట్నం 43.4, గన్నేరువరం 43.3, కొత్తపల్లి, ఇల్లందకుంట 43.1, హుజూరాబాద్ 42.4, సైదాపూర్ 41.9°C గా నమోదైంది.