News August 25, 2025
KNR: నేటి నుంచి మిలాద్ ఉన్నబీ వేడుకలు

ప్రవక్త మహ్మద్ పుట్టినరోజు సందర్భంగా ఉమ్మడి జిల్లాలో మిలాద్ ఉన్నబీ వేడుకలు జరగనున్నాయి. ఉత్సవాలు నేటి నుంచి SEP 25 వరకు జరుగుతాయని జమాతే ఇస్లామీ హింద్ నేత మహమ్మద్ నాయిముద్దీన్ సోమవారం కరీంనగర్లో ప్రకటించారు. ప్రవక్త బోధనలు ఒక మతానికి మాత్రమే పరిమితం కాకుండా అందరికీ వర్తిస్తాయని, సమాజంలో మార్పు కోసం దోహద పడతాయని చెప్పారు. ప్రవక్త గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి పోటీలు నిర్వహిస్తామన్నారు.
Similar News
News August 27, 2025
RGM: TBGKS కేంద్ర కోశాధికారిగా చెల్పూరి సతీశ్

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(TBGKS) కేంద్ర కోశాధికారిగా రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన చెల్పూర్ సతీశ్ను నియమిస్తున్నట్లు యూనియన్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి పేర్కొన్నారు. గత 20 ఏళ్లుగా BRS పార్టీలో పనిచేస్తూ విద్యార్థి నాయకుడిగా, యూనియన్లో క్రియాశీలకంగా పనిచేసిన సతీశ్ను ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్కు కృతజ్ఞతలు తెలిపారు.
News August 27, 2025
పెద్దపల్లి: క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి చర్యలు: దీపక్ జాన్

తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ దీపక్ జాన్ మంగళవారం పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్లో పాస్టర్లతో సమావేశం నిర్వహించి, చర్చి నిర్మాణ అనుమతులు, బరియల్ గ్రౌండ్స్, కుల ధ్రువపత్రాలు, క్రిస్టియన్ భవన్ ఏర్పాటుకు సంబంధించిన వినతులను పరిశీలించారు. అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ డి.వేణుతోపాటు సంబంధిత అధికారులను ఆదేశించారు.
News August 27, 2025
చైనా పట్ల ట్రంప్ డబుల్ యాక్షన్!

చైనా విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డబుల్ యాక్షన్ చేస్తున్నారు. ఓ వైపు 200% టారిఫ్స్ వడ్డిస్తామంటూనే మరోవైపు 6 లక్షల మంది చైనీస్ విద్యార్థులను చదువుకునేందుకు ఆహ్వానిస్తున్నారు. ప్రస్తుతం చైనాతో సంబంధాలు మెరుగుపరుచుకోవాలని కోరుకుంటున్నట్లు ట్రంప్ చెప్పారు. కాగా ఇటీవల భారత్, చైనా పట్ల యూఎస్ కఠిన వైఖరి ప్రదర్శించింది. ఇంతలో మళ్లీ యూటర్న్ తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.