News September 14, 2025

KNR: పితృదేవతలు ఇంటి ద్వారం దగ్గర నిలబడతారని నమ్మకం

image

ఉమ్మడి KNR జిల్లా వ్యాప్తంగా పెత్తరమాస(పెద్దల అమావాస్య) ఈ రోజు ప్రారంభమైంది. తండ్రి, తాత, ముత్తాతలను తలుచుకొని పుత్రులు నిర్వహించే కార్యక్రమం ఇది. ఈ అమావాస్య రోజున పితృదేవతలు ఇంటి ద్వారం దగ్గర నిలబడతారని ప్రజల నమ్మకం. శ్రాద్ధకర్మ చేయడం ద్వారా వారి తర్వాతి తరం వారికి దీవెనలు అందుతాయని పల్లెల్లో విశ్వసిస్తారు. ఈ అమావాస్య అనంతరం విజయదశమి వేడుకలు ప్రారంభమవుతాయని, పండితులు, శాస్త్రాలు తెలుపుతున్నాయి.

Similar News

News September 14, 2025

నల్గొండ: 26,692 కేసుల పరిష్కారం

image

జాతీయ లోక్ అదాలత్ జిల్లాలో విజయవంతంగా ముగిసింది. శనివారం ఒక్క రోజే 26,692 కేసులను పరిష్కరించినట్లు జిల్లా జడ్జి ఎం.నాగరాజు వెల్లడించారు. ఈ అదాలత్‌లో 71 సివిల్, 15,921 క్రిమినల్, 96 మోటార్ వాహన ప్రమాద బీమా, 50 బ్యాంక్, 73 సైబర్ క్రైమ్, 35 ట్రాన్స్‌కో, 10,446 ట్రాఫిక్ చలాన్ కేసులు రాజీ కుదిరి పరిష్కారమయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

News September 14, 2025

లోక్‌సభ ర్యాంకిగ్స్‌లో నంద్యాల MPకి 11వ ర్యాక్

image

లోక్‌సభలో MPల పెర్ఫామెన్స్‌ రిపోర్ట్‌ను పార్లమెంట్ ఆదివారం విడుదల చేసింది. 2024 జూన్ 24 నుంచి 2025 ఏప్రిల్ 4వ తేదీ వరకు MPలు పాల్గొన్న డిబెట్‌లు, అడిగిన క్వశ్చన్స్, అటెండెన్స్ ఆధారంగా ఈ ర్యాంక్‌లు ఇచ్చింది. ఈ నివేదికలో నంద్యాల MP బైరెడ్డి శబరి 11వ స్థానంలో నిలిచారు. ఆమె లోక్‌సభలో మొత్తం ప్రశ్నలు 78 అడగగా, 09 చర్చల్లో పాల్గొన్నారు. కాగా ఆమె హాజరు శాతం 82.35గా ఉంది. మరి MP పని తీరుపై మీ కామెంట్..!

News September 14, 2025

ఇది మన నెల్లూరు కొత్త కలెక్టర్ ప్రేమకథ.!

image

ప్రజలకు సేవా చేయాలన్న తపన వారిద్దరిది. IASకు ప్రయత్నించి ఒకరు మొదటి ప్రయత్నంలో, మరొకరు రెండో ప్రయత్నంలో సెలక్ట్ అయ్యారు. ట్రైనింగ్ పీరియడ్‌లో వాళ్ల మధ్య ఏర్పడ్డ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇది మన నెల్లూరు కొత్త కలెక్టర్ హిమాన్షు శుక్లా-కృతికా శుక్లా ప్రేమ కథ. ప్రస్తుతం ఆమె పల్నాడు కలెక్టర్‌గా పని చేస్తున్నారు. శనివారం ఇద్దరూ బాధ్యతలు చేపట్టారు.