News April 16, 2025

KNR: పైలట్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండ్ పూర్తిచేయాలి: కలెక్టర్

image

పైలట్ ప్రాజెక్టులో ఎంపికైన గ్రామాల్లో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ వర్క్ పూర్తిచేయాలని మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ పమేలా సత్పతి అధికారులకు సూచించారు. పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో నిబంధనల ప్రకారం ‌కట్టుదిట్టమైన ప్రణాళికతో అత్యంత నిరుపేదలను లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని సూచించారు. పొరపాటులకు తావివ్వరాదని అన్నారు. ఆర్డీవోలు, తహశీల్దార్లు పాల్గొన్నారు.

Similar News

News April 18, 2025

ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియను వేగవంతం చేయాలి: అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్

image

కరీంనగర్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా 15 మండలాల్లో ఇండ్ల నిర్మాణానికి మార్కింగ్ ప్రక్రియ 100% పూర్తిచేయాలని అధికారులను అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ ఆదేశించారు. ఇప్పటీవరకు 2027 మందికి ఇండ్లు మంజూరు కాగా, 730 ఇండ్లకు మార్కింగ్ పూర్తయిందని, 114 ఇండ్లు బేస్మెంట్ దశలో ఉన్నాయన్నారు. రెండో దశ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. అత్యంత నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

News April 18, 2025

కరీంనగర్ జిల్లాలో కొనసాగుతున్న ఎండ తీవ్రత

image

కరీంనగర్ జిల్లాలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. గత 24 గంటల్లో అత్యధికంగా గంగాధర మండలంలో 41.3°C నమోదు కాగా, మానకొండూర్ 40.9, గన్నేరువరం 40.4, రామడుగు 40.2, జమ్మికుంట 40.1, చొప్పదండి 39.9, తిమ్మాపూర్ 39.7, చిగురుమామిడి 39.6, శంకరపట్నం 39.5, కరీంనగర్ రూరల్ 39.4, సైదాపూర్ 39.3, కరీంనగర్ 39.2, వీణవంక 39.0, కొత్తపల్లి 38.6, హుజూరాబాద్ 38.4, ఇల్లందకుంట 38.0°C గా నమోదైంది.

News April 18, 2025

రేపు హుజురాబాద్‌లో స్వచ్భ ఎగ్జిబిషన్: మున్సిపల్ కమిషనర్

image

హుజురాబాద్ పట్టణంలోని సాయి రూప ఫంక్షన్ హాల్‌లో ఈ నెల 19న స్వచ్ఛ ఎగ్జిబిషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య తెలిపారు. జిల్లాలోనే తొలిసారిగా పర్యావరణంపై ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు,, జమ్మికుంట కృషి విజ్ఞాన శాస్త్రవేత్తలు ఎగ్జిబిషన్లను ప్రదర్శిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమములో ముఖ్య అతిథులుగా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ పాల్గొంటారాని తెలిపారు.

error: Content is protected !!