News December 28, 2025

KNR: ప్రశాంతంగా వేడుకలు జరుపుకోండి: సీపీ

image

నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం విజ్ఞప్తి చేశారు. కమిషనరేట్ పరిధిలో పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపి ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించవద్దని, అతివేగం వల్ల ప్రమాదాల బారిన పడవద్దని చెప్పారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులకు సహకరించి కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలకాలని కోరారు.

Similar News

News December 30, 2025

కరీంనగర్: ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు!

image

TGలో మున్సిపల్ ఎన్నికల సందడి అధికారికంగా మొదలైంది. ఎన్నికల కమిషనర్ గిరిధర్ సుందర్ బాబు కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, చొప్పదొండి, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల కమిషనర్లతో నిర్వహించిన VCలో కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరిలో జరగనున్నాయి. ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా చూడాలని, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల లెక్క తేల్చాలని స్పష్టమైన ఆదేశాలు అందాయి.

News December 30, 2025

KNR: యూరియా సరఫరా నిరంతరం పర్యవేక్షించాలి

image

వ్యవసాయ అధికారులు ప్రతిరోజు మండల, క్లస్టర్ స్థాయిలో యూరియా సరఫరాను పర్యవేక్షించాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మండల వ్యవసాయ అధికారులు, ప్రాథమిక సహకార సంఘాల అధికారులతో ఆమె మాట్లాడారు. యూరియా నిల్వలు, సరఫరా, వ్యవసాయశాఖ, కేంద్రప్రభుత్వ పథకాలు, ధాన్యం కొనుగోలు, తదితర అంశాలపై చర్చించారు.

News December 30, 2025

KNR: సన్న బోనస్ ఊసేది..? రైతు భరోసా ఎప్పుడు..?

image

సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామన్న సర్కారు హామీ క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. చాలామంది రైతుల ఖాతాల్లో నేటికీ నగదు జమకాలేదు. మరోవైపు ‘రైతు భరోసా’ ఊసే లేకపోవడంతో జిల్లా రైతాంగం తీవ్ర ఆవేదన చెందుతోంది. అప్పులు తీరక, కొత్త సాగుకు సాయం అందక రైతులు సతమతమవుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలు విడుదల చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.