News August 23, 2025
KNR: ప్రాథమిక, అంగన్వాడీ చిన్నారులకు ఆటల పోటీలు

జాతీయ క్రీడా దినోత్సవ వారోత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా సప్తగిరి కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక, అంగన్వాడీ చిన్నారులకు ఆటలు పోటీలు నిర్వహించారు. అంగన్వాడీ చిన్నారులు, ప్రాథమిక పాఠశాల విద్యార్థుల రన్నింగ్ పోటీని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి జెండా ఊపి ప్రారంభించారు. రన్నింగ్ పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానం సాధించిన విద్యార్థులకు కలెక్టర్ మెడల్స్ ప్రదానం చేశారు.
Similar News
News August 24, 2025
గర్షకుర్తిలో రూ.70 లక్షల అప్పు చేసి వ్యాపారి పరారీ

గంగాధర(M) గర్షకుర్తికి చెందిన మిట్టపెల్లి రాజేశం అనే చీరల వ్యాపారిని, అతనితో పాటు గ్రామానికి చెందిన మరికొందరిని తమిళనాడుకు చెందిన వినోత్ రాజ్ మోసం చేశాడు. టెక్స్టైల్స్ వ్యాపారం పేరుతో రూ.70 లక్షలకు పైగా అప్పు చేసి పరారయ్యాడు. రాజేశం ఇంట్లో అద్దెకు ఉంటున్న వినోత్ రాజ్ ఈ మోసానికి పాల్పడినట్లు ఎస్సై వంశీ కృష్ణ తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
News August 24, 2025
చొప్పదండి: అగ్ని ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలి

వినాయక నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి అగ్ని ప్రమాదాల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాస్ రెడ్డి కోరారు. మండపం వద్ద లైవ్ విద్యుత్ కనెక్షన్లను పరిశీలించాలని, మండపంలో అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అగ్రి ప్రమాదాల నివారణకు ఎస్ఎఫ్ఓ 8712699247,8712699246 సెల్ నంబర్లతో టచ్లో ఉండాలని కోరారు.
News August 23, 2025
KNR: సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా శ్రీనివాస్

సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కరీంనగర్ జిల్లా సిపిఐ కార్యదర్శి పంజాల శ్రీనివాస్ నియామక మయ్యారు. మేడ్చల్ మల్కాజ్గిరి లో నిర్వహించిన CPI 4వ రాష్ట్ర మహాసభల్లో పార్టీ శ్రేణులు ఆయనకు నియామక ఉత్తర్వులు అందించారు. తన నియామకానికి సహకరించిన సీనియర్ నాయకులు, పార్టీ నేతలకు శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. రాబోవు రోజుల్లో మరింత ఉత్సాహంతో ప్రజా సమస్యల పరిష్కారాని కోసం పోరాటాలు చేస్తామని శ్రీనివాస్ తెలిపారు.