News March 19, 2025
KNR: బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు ఆహ్వానం

ఉమ్మడి KNR జిల్లాలోని 6, 7, 8, 9 తరగతుల్లో మిగిలిపోయిన సీట్లలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మహాత్మాజ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకులాల సంస్థ రీజినల్ కో ఆర్డినేటర్ అంజలి కుమారి తెలిపారు. మార్చి 31 వరకు ఆన్లైన్, మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. www.mjptbcwreis.telangana.gov.in వెబ్సైట్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.
Similar News
News March 1, 2026
ALERT: దంచికొట్టనున్న ఎండలు.. జాగ్రత్త

TG: ఈవారం ఎండలు దంచికొడతాయని, మార్చి 3 నుంచి 7 వరకు ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘భద్రాద్రి, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో 39-41°C వరకు ఎండలు నమోదవుతాయి. HYDలో 36-37°C ఉష్ణోగ్రతలు ఉండవచ్చు. వేసవి ప్రారంభమైనందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. తగినంత నీరు తాగుతూ ఉండాలి’ అని సూచిస్తున్నారు. SHARE IT
News March 1, 2026
పటాన్చెరు: జిమ్లో లవ్❤︎.. పెళ్లికి నిరాకరణ!

పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు ముఖం చాటేస్తున్నాడని బాధితురాలు అమీన్పూర్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగింది. పోలీసుల కథనం ప్రకారం.. అమీన్పూర్కు చెందిన యువతికి, మయూరినగర్ నివాసి అరవింద్తో జిమ్లో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వివాహం చేసుకోవాలని కోరగా అతను నిరాకరించి దూరం పెడుతున్నాడని, తనకు న్యాయం చేయాలని ఆమె పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 1, 2026
ఇదేం నీతి.. పాకిస్థాన్ ఉగ్రవాదం కనిపించట్లేదా ట్రంప్?

ఇరాన్ మిడిల్ ఈస్ట్లో ఉగ్రవాదులతో చేతులు కలిపి అశాంతికి కారణం అవుతోందని, న్యూక్లియర్ బాంబులు తయారు చేస్తోందని అమెరికా దాడి చేసింది. సుప్రీం లీడర్ను చంపేసింది. ఇదే నీతి పాకిస్థాన్కు ఎందుకు వర్తించదని పలువురు ప్రశ్నిస్తున్నారు. జైషే మహమ్మద్, లష్కరే తోయిబా లాంటి ఉగ్రసంస్థలను పాక్ పెంచి పోషిస్తోందని భారత్ చాలా సార్లు నిరూపించింది. అయినా అమెరికా పాక్కు సపోర్ట్ చేస్తోందే తప్ప చర్యలు తీసుకోలేదు.


