News August 13, 2025

KNR: భారీ వర్షాలు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

భారీ వర్షాల నేపథ్యంలో KNR కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఈ నెల 13 నుంచి 17 వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురువనున్నాయని వాతావరణ శాఖ సూచనల మేరకు ముందు జాగ్రత్త చర్యగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. వర్షాల నేపథ్యంలో సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్ 0878 2997247 కు కాల్ చేయాలని, ఈ సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటాయని చెప్పారు.

Similar News

News August 13, 2025

కరీంనగర్: ‘స్వచ్ఛ హరిత విద్యాలయ’ రేటింగ్‌లో పాల్గొనాలి

image

కరీంనగర్ జిల్లాలోని అన్ని పాఠశాలలు కేంద్ర విద్యా శాఖ నిర్వహిస్తున్న ‘స్వచ్ఛ హరిత విద్యాలయ రేటింగ్’లో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. స్వచ్ఛ హరిత విద్యాలయ నమోదు, బోధన, ఇంగ్లీష్ క్లబ్ వంటి అంశాలపై ఆమె మండల విద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. అన్ని పాఠశాలల్లో బుధవారం నుంచి ‘బుధవారం బోధన’ కార్యక్రమాన్ని అమలు చేయాలని కలెక్టర్ సూచించారు.

News August 12, 2025

KNR: ‘నూతన భవనం వినియోగంలోకి తేవాలి’

image

కార్ఖానగడ్డలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల(సైన్స్ వింగ్)ను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. ఇక్కడ జరుగుతున్న మౌలిక సదుపాయాలు, మరమ్మతు పనులను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ముందుగా కళాశాల ప్రాంగణంలో ఉన్న స్క్రాప్ తొలగించాలని ఆదేశించారు. కళాశాలలోని నూతన భవనంలో సౌకర్యాలు కల్పించి తరగతులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ప్రిన్సిపల్ వెంకటరమణచారి ఉన్నారు.

News August 12, 2025

కరీంనగర్: శ్రావణి సమాఖ్య పురస్కారాలు అందజేత

image

కరీంనగర్‌లో జరిగిన శ్రావణి సాహితీ, సాంస్కృతిక సమాఖ్య త్రిదశాబ్ది ఉత్సవాల సందర్భంగా ముగ్గురు ప్రముఖులకు పురస్కారాలు అందజేశారు. ప్రముఖ కవి, అవధాని గండ్ర లక్ష్మణరావు, ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల ప్రిన్సిపల్ కే. రామకృష్ణ, విశ్రాంత ఉపన్యాసకులు వంగపల్లి ప్రభాకర్ రావులకు ఈ పురస్కారాలు లభించాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వీరు చేస్తున్న సాహిత్య సేవలను గుర్తించి ఈ పురస్కారాలు అందించినట్లు నిర్వాహకులు తెలిపారు.