News December 30, 2025
KNR: ‘మహా శివరాత్రి జాతరకు పటిష్ఠ బందోబస్తు’

ఫిబ్రవరి 14, 15, 16వ తేదీలో వేములవాడలో జరుగనున్న మహా శివరాత్రి జాతరకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేస్తామని ఎస్పీ మహేశ్ బి.గితే తెలిపారు. జాతర సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతర సందర్భంగా 8 మంది డీఎస్పీలు, 38 మంది సీఐలు, 119 మంది ఎస్సైలు, 158 ఏఎస్సైలు, 388 కానిస్టేబుళ్లు, హోమ్ గార్డ్స్తో కలిపి మొత్తం 1300 మందికి పైగా పోలీసులు మూడు రోజులు బందోబస్తు నిర్వహిస్తారని వెల్లడించారు.
Similar News
News December 31, 2025
వనపర్తిలో మరోసారి ఎన్నికలు.!

వనపర్తి జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో పోలింగ్కు అధికారులు సిద్ధం అవ్వాలని ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. 2011 జనాభా లెక్కల ప్రకారం..
✓ వనపర్తి- 33 వార్డుల్లో 70,416 మంది జనాభా
✓ పెబ్బేరు- 12 వార్డుల్లో 15,602 మంది
✓ కొత్తకోట- 15 వార్డుల్లో 19,042 మంది
✓ ఆత్మకూర్- 10 వార్డుల్లో 15,039 మంది
✓ అమరచింత- 10 వార్డుల్లో 11,225 మంది.
ఓటర్ల జాబితాను అధికారులు సిద్ధం చేయనున్నారు.
News December 31, 2025
సెలవు ఎరుగని ‘గురువు’.. ఐదేళ్లుగా నిరంతర విద్యా బోధన

అయినవిల్లి మండలం ముక్తేశ్వరం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కుడిపూడి నాగేశ్వరరావు అరుదైన రికార్డు సృష్టించారు. గత ఐదు ఏళ్ల కాలంలో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా విధులకు హాజరై వృత్తిపట్ల తన అంకితభావాన్ని చాటుకున్నారు. దివ్యాంగుడైన ఆయనకు కేటాయించిన ప్రత్యేక సెలవులను కూడా వాడకపోవడం విశేషం. ఆయన నిబద్ధతను గుర్తిస్తూ విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయ లోకం ప్రత్యేక అభినందనలు తెలుపుతోంది.
News December 31, 2025
2025: గోల్డ్ ₹57వేలు, వెండి ₹1.6L పెరిగింది!

ఈ ఏడాది బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోయి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించాయి. JANలో 10gల బంగారం ధర ₹78,000 ఉండగా.. డిసెంబర్ 31న ₹1,35,880తో ముగించి ఇన్వెస్టర్లకు దాదాపు 78%(₹57k) లాభాలను అందించింది. అటు కిలో వెండి ధర 2025 ప్రారంభంలో ₹98,000 ఉండగా ప్రస్తుతం ₹2.58 లక్షలకు చేరుకొని 150%(₹160k) పైగా వృద్ధిని నమోదు చేసింది. కొత్త ఏడాదిలో గోల్డ్, సిల్వర్ ధరలెలా ఉంటాయో చూడాలి.


